స్క్రిప్ట్ లో రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని ఇన్వాల్వ్ చేసి మార్పులు సూచించాడని టాక్. అలాగే రాజమౌళి సలహాతో కొన్ని సీన్స్ ని రీషూట్ కూడా చేశారని అంటున్నారు. సెప్టెంబర్ 9 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. జనాలకి రీచ్ అయ్యేలా అన్ని మార్గాలని అన్వేషిస్తున్నాడు రాజమౌళి. తాజాగా అలియా, రణబీర్ కపూర్ లని యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాంకి హాజరయ్యేలా చేశాడు. అలియా భట్, రణబీర్ కపూర్ లాంటి బిగ్ స్టార్స్ ని క్యాష్ ప్రోగ్రాంకి తీసుకువచ్చాడంటే.. జక్కన్న చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు అని అర్థం అవుతోంది.