దర్శకధీరుడు రాజమోళికి ప్రపంచం మొత్తం ఫిదా అవుతోంది. కానీ రాజమౌళిని ఫిదా చేసిన దర్శకులు కొందరు ఉన్నారు. ముఖ్యంగా ఓ దర్శకుడు తెరకెక్కించిన సీన్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో తనకి ఇష్టమైన దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ అని రాజమౌళి తెలిపారు.
25
జగడం మూవీలో సీన్
చాలా సినిమాలు చూసి ఇలాంటి మూవీ నేనెందుకు చేయలేకపోయాను అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇలాంటి సన్నివేశం తెరకెక్కించే ఐడియా నాకెందుకు రాలేదు అని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సుకుమార్ తెరకెక్కించిన జగడం చిత్రంలో ఓ సీన్ అంటే నాకు చాలా ఇష్టం.
35
అది అద్భుతమైన సీన్
రామ్ పోతినేని ఓ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. కానీ ఆ గ్యాంగ్ లో అతడిని వెనుక నిలుచోబెడతారు. కానీ అపోజిట్ గ్యాంగ్ బలంగా ఉంటుంది. దీనితో రామ్ ఉన్న గ్యాంగ్ లో వాళ్లంతా భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. చివర ఉన్న రామ్ మాత్రం అక్కడే ఉండడంతో గ్యాంగ్ లో ముందు నిలబడతాడు. ఆ సీన్ ఎంతో స్టైలిష్ గా, గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది అని రాజమౌళి తెలిపారు.
అలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదబ్బా అని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు. ఒక రోజు సుకుమార్ ని పిలిచి మరీ చెప్పా. సినిమా మొత్తం ఎలా ఉన్నా పర్వాలేదు.. ఆ ఒక్క సీన్ పవన్ కళ్యాణ్ తో పడి ఉంటే టాలీవుడ్ లో నువ్వే నంబర్ 1 డైరెక్టర్ అయ్యేవాడివి అని చెప్పినట్లు రాజమౌళి తెలిపారు.
55
సినిమా ఫ్లాప్
సుకుమార్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన జగడం మూవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. వాస్తవానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించాల్సింది. కానీ చివరికి రామ్ చేతుల్లోకి వెళ్ళింది.