ఇటీవల ముంబయిలో ప్రెస్మీట్లో రామ్చరణ్కి ఇదే ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ పాత్రని మీరు డామినేట్ చేశారనే కామెంట్లపై ఆయన స్పందించారు. తాను ఒక్కశాతం కూడా అలా ఆలోచించడం లేదని, డామినేషన్, నిడివిని పట్టించుకోనని, అసలు అలాంటి తేడానే లేదని, ఇద్దరు పాత్రలు సమ ప్రాధాన్యత కలిగి ఉంటాయని, ఈ వాదనలో నిజం లేదని కొట్టిపడేశారు. అయితే తాజాగా రాజమౌళికి ఈ ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్కి అన్యాయం చేశారనే ప్రశ్న ఆయనకు ఓ ఇంటర్వ్యూలో ఎదురు కాగా, జక్కన్న స్పందించారు. బ్రిలియంట్గా అన్సర్ ఇచ్చారు.