`మహాభారతం` కాదు.. మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ బయటపెట్టిన రాజమౌళి.. వామ్మో జక్కన్న మామూలోడు కాదుగా!

First Published May 10, 2024, 3:59 PM IST

దర్శకధీరుడు రాజమౌళికి మహాభారతం సినిమా తీయాలనేదే కాదు, మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఉంది. ఆ విషయాన్ని బయటపెట్టారు. అది తన డ్రీమ్‌ అని చెప్పారు. 
 

దర్శకధీరుడు రాజమౌళి ఊహలు ఎవరికి అందని స్థాయిలో ఉంటాయి. ఆయన ప్లాన్‌ చేస్తే పీక్‌లో ఉంటుంది. మరే దర్శకుడికి సాధ్యం కాదు అనేంతగా ఆయన ప్లాన్స్ ఉంటాయి. దర్శకుడిగా తనకంటూ ఓ డ్రీమ్‌ ఉంది. ఫైనల్‌గా `మహాభారతం` తీయాలనేది ఆయన చిరకాల కల. దీన్ని ఐదు పార్ట్ లుగా ప్లాన్‌ చేశారు రాజమౌళి. గతంలోనే ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. 

రాజమౌళి తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ కి చేరుకోవడానికి, మహాభారతం సినిమా తీయడానికి కావాల్సన శక్తిని కూడగట్టుకునే పనిలో ఉన్నారు జక్కన్న. అందులో భాగంగానే `ఈగ`, `మగధీర`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు చేస్తున్న మహేష్‌ బాబు మూవీ కూడా అందులో భాగమే. వరల్డ్ ఆడియెన్స్ కి మన సినిమా దగ్గర కావాలని, ప్రపంచ సినిమాని శాషించేస్థాయిలో `మహాభారతం` ఉండాలనేది రాజమౌళి ప్లాన్‌. `అవేంజర్స్`, `అవతార్‌` తరహాలో తాను ఈ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారు. 

SS Rajamouli teams up with cricketer David Warner

అయితే తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు రాజమౌళి. తనకు మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఉందన్నారు. తన కెరీర్‌లో ఎప్పటికైనా యానిమేషన్‌ మూవీ చేయాలని ఉందట. ఇటీవల `బాహుబలి` యానిమేషన్‌ మూవీ మీడియాకి ప్రదర్శన సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

తనకు యానిమేషన్‌ సినిమా చేయాలనే డ్రీమ్‌ ఉందని, దానిపై అవగాహణ కోసమే `బాహుబలి` యామినేట్‌ మూవీకి ఒప్పుకున్నట్టు తెలిపారు. ఈ మూవీ ప్రాసెస్‌లో చాలా నేర్చుకున్నట్టు తెలిపారు. తాను ఎప్పటికైనా ఓ భారీ యానిమేషన్‌ చిత్రం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.ఇప్పుడు ఆడియెన్స్ ఇలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారని అన్నారు. తాను కూడా అలాంటి యానిమేషన్‌ మూవీతో మెప్పించాలనుకుంటున్నట్టు తెలిపారు రాజమౌళి. 

అందరిలో లాగా తాను కూడా అన్ని రకాల సినిమాలు చేసి నిరూపించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు రాజమౌళి. `బాహుబలి` యానిమేషన్‌ ఫిల్మ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. యానిమేషన్‌ సినిమాలను చేయాలనే కోరిక ఉందని, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నట్టు తెలిపారు. మున్ముందు అలాంటి సినిమా చేస్తానని తెలిపారు. 

ఇక `బాహుబలి`కి మరో పార్ట్ `బాహుబలి 3` చేయాలనుకున్నట్టు చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత అదే చేయాలని అనుకున్నాడట. కానీ మహేష్‌ బాబు సినిమా కారణంగా దాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. మహేష్‌ సినిమా తర్వాత `బాహుబలి 3` ఉంటుందన్నారు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌`కి సీక్వెల్‌ కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి అది ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్న. 
 

Rajamouli

మహేష్‌ బాబు హీరోగా, రాజమౌళి ఇప్పుడు `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీతో అంతర్జాతీయ ఆడియెన్స్ ని టార్గెట్‌ చేస్తున్నారు. కొత్త ఆడియెన్స్ ని సినిమా చూసేందుకు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలిపారు. మహేష్‌ సాహసికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.  

click me!