Ennenno Janmala Bandham: వేద, యష్ ల గురించి బాధపడుతున్న రాజారాణి.. మళ్లీ ఒక్కటైన మాళవిక, భ్రమరాంబిక?

First Published Jan 16, 2023, 1:37 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 16వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో వేద గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు రాజా వేద వైపు చూస్తుండగా వేద సిగ్గుపడుతూ ఉంటుంది. వెల్లమ్మ వెళ్లి రెడీ అవ్వు మీ అమ్మమ్మ నీకు ఒడిబియ్యం పోస్తుంది అని అనడంతో వేద సిగ్గుపడుతూ ఆయన్ని ఇప్పుడే నిద్ర లేపకండి తర్వాత నేను స్నానం చేసి లేపుతాను అనగా సరే అని అంటాడు. అప్పుడు రాజా సంతోషపడుతూ ఇన్ని రోజులు కలవకపోయినా ఈ వేణుగోపాలస్వామి పుణ్యమా వారిద్దరి ఇప్పుడు ఒక్కటే అయ్యారు అని రాజా అనడంతో వాళ్ళిద్దరూ ఒకటవ్వలేదండి అని రాణి అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజా. కలవలేదా అనగా కలిసిపోయినట్టు ఇద్దరు నటిస్తున్నారు అని అంటుంది  రాణి.
 

అప్పుడు ఏం మాట్లాడుతున్నావ్ రాణి అనగా జరిగిన మొత్తం రాణి వివరించడంతో రాజా షాక్ అవుతాడు. వాళ్ళిద్దరూ ఇక్కడికి ఎదురుగా వస్తే ఒకటి చేసి పంపుదామని అనుకున్నాము కానీ వాళ్ళు ఇప్పటికీ ఇద్దరు గానే ఉన్నారు అని అంటుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది కానీ మాటల్లో చేతుల్లో కనిపించడం లేదు అని బాధగా మాట్లాడుతుంది రాణి. వాళ్ల సమస్య ఏమిటో తెలియడం లేదండి అనడంతో మనకే కాదు వాళ్ళ సమస్య ఏమిటి అనేది వాళ్లకే తెలియడం లేదు అంటాడు రాజా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరికి తెలుసని అనుకుంటున్నారు అని రాజా అనగా వాళ్ళిద్దరిని ఒకసారి గట్టిగా మందలిస్తాము అనడంతో ఒకరు చెప్పడం కంటే వారంతోటి వాళ్ళు తెలుసుకుంటేనే ఆ కాపురం బాగుంటుంది అని అంటాడు.
 

 అప్పుడు వారిద్దరూ వేద,యష్ ల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత వేదకి ఒడి బియ్యం పోస్తుండగా పనిమనిషి అనుకోకుండా నీకు పండంటి బిడ్డ పుట్టాలమ్మా అనడంతో అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వేద బాధపడుతుండగా అప్పుడు రాణి నువ్వు ఎంతో కొంత ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందని మీ అమ్మ నాతో అనింది.  ఈరోజు ముత్యాలు కూడా నోటి నుంచి ముత్యాలు లాంటి మాటలు అంది. ఇదిగో ఈ బుల్లి కృష్ణుడు లాంటి బుల్లి బాబు నీ కడుపున పుట్టాలని ఆశీర్వదిస్తున్నాను అనడంతో వేద సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వేద, యష్ ఇద్దరు కలసి రాజారాణి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.
 

మరొకవైపు మాళవిక తన గదిలోకి వెళ్ళగా అక్కడున్న కాస్మోటిక్ అని లేకపోవడంతో పనిమనిషిని ఏమయ్యాయి అని అడగడంతో ఆమె పెద్ద మేడం చెప్పడంతో అవన్నీ డస్ట్ బిన్ లో పడేసాను అని అంటుంది. ఇప్పుడు అభిని పిలిచి నాకు కాస్మోటిక్స్ అన్ని మీ అక్క చెప్తే కుప్పలో పడేయమని చెప్పింది అది అడగడానికి చెప్పడానికి నేనెవరు బంగారం అని అంటాడు అభి. అప్పుడు భ్రమరాంబిక కిందకు వచ్చి అభి ఎవరు ఈ మాళవిక అని అడుగుతుంది. మాళవిక ఎవరు మన గెస్ట్ కాబట్టి అతిథిదేవోభవ అన్నది నా పాలసీ. అలాంటిది అతిధిని ఎంత బాగా చూసుకోవాలి. మాళవిక వాడేవన్నీ చీప్ ప్రొడక్ట్స్ అందుకే అవన్నీ తీసి డెస్టిబిన్ లో పారేయించాను.

అమెరికా నుంచి తెప్పిస్తున్నాను ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో మాధవిక నా తమ్ముడు తరఫున నీకు సారీ చెప్తున్నాను అని అంటుంది. అప్పుడు మళ్లీ వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టు మాట్లాడడంతో అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు భ్రమరాంబిక మాళవికని అభి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నా గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే నేను చెప్పడానికంటే అభి చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే నాకంటే అభికే బాగా తెలుసు అని తప్పించుకుంటుంది. మరొకవైపు యష్, వేద ఇద్దరూ ఊరికి వెళ్లడానికి రెడీ అవ్వగా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు కదా అనగా ఇంకా నాలుగు రోజులు ఉన్నా మీకు అలాగే అనిపిస్తుంది తాతయ్య మేం వెళ్లాలి అని అంటుంది వేద.
 

ఇంకోసారి అందరూ కలిసి వస్తాము అప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేయవచ్చు అని అంటాడు యష్. ఆ తర్వాత వేద ఎస్ ఎదురు బయటకు వెళ్తూ గుమ్మం వైపు చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు అక్కడ గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు కోయిల కూయడంతో వేద అక్కడికి వెళ్తుంది. అప్పుడు వేద కూడా కోయిల లాగా కూయడంతో కోయిల కూడా అరుస్తూ ఉంటుంది. అప్పుడు అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు రాజా, రాణి భార్యాభర్తల బంధం గురించి యష్ వేద ల గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. అప్పుడు గ్రాండ్పా నేను వేదని చాలా చాలా ప్రేమిస్తున్నాను వేద  కూడా నన్ను అనగా వేద వెనక్కి తిరిగి చూడగా చెప్పకుండా మౌనంగా ఉంటాడు యష్.
 

నువ్వు ప్రేమించడం లేదు అని అనట్లేదు ఇద్దరు ప్రేమించుకోండి అప్పుడే మీది ఎన్నెన్నో జన్మల బంధం అవుతుంది అంటాడు. మీరిద్దరూ ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారు జీవితాంతం అదేవిధంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు రాజా. ఇదే మా చివరి కోరిక అనుకొని నాకు మాట ఇవ్వు బాబు అని రాజా మాట అడుగుతాడు. ఇప్పుడు యష్ రాజాకి మాట ఇస్తున్న వల్ల వేదకీ ఎటువంటి లోటు రానివ్వను బాధ రానివ్వను అని మాట ఇస్తాడు. అప్పుడు వేదవాళ్లు వెళ్తూ ఉండగా వేద రాజా రాణి ని చూసి వెనక్కి వెళ్లి హత్తుకుని బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి తాతయ్య క్షమించండి అమ్మమ్మ మిమ్మల్ని చాలా మోసం చేశాను అని ఏడుస్తూ ఉంటుంది వేద.

click me!