రాధిక, రమ్యకృష్ణ తో పాటు సీరియల్స్ లోకి జంప్ అయిన స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Published : Jul 02, 2025, 11:39 AM IST

80, 90 సినిమాల్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన ఎంతో మంది తారలు, అవకాశాలు తగ్గడంతో ఆల్టర్నేటివ్స్ వెతుకున్నారు. ఈక్రమంలో సినిమాలు వదిలేసి కొంత కాలం సీరియల్స్ చేసిన హీరోయిన్లు ఎవరు? 

PREV
17

సినిమా అవకాశాలు తగ్గడంతో కొంత మంది హీరోయిన్లు సీరియల్స్ వైపు టర్న్ అయ్యారు. వెండితెరపై వెలుగు వెలిగిన కొంతమంది తారలు వయసు పెరిగి, పెళ్లయ్యాక, బరువు పెరిగి అవకాశాలు తగ్గడంతో రీ ఎంట్రీ కోసం సీరియల్స్ ను ఉపయోగించుకున్నారు. సీరియల్స్ ద్వారా మరోసారి తమ సత్తా చాటి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మళ్లీ వెండితెరకు జంప్ అయ్యారు. అలాంటి హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

27

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఊపేసింది రాధిక. చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, విజయకాంత్, శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్ గా రాధికకు అవకాశాలు తగ్గిన టైమ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారపోయింది. 

ఈక్రమంలో ఆమె బుల్లితెరకు జంప్ అయ్యారు. బుల్లితెరపై కూడా అదే స్టార్ డమ్ తో కొనసాగింది రాధిక. ఇది కథ కాదు, పిల్లి, చిట్టి, వాణి రాణి, లాంటి సీనియల్స్ లో నటించారు. ఆతరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది రాధిక. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ కు తల్లి పాత్రల్లో నటిస్తోంది.

37

సినిమా నుండి టీవీకి వెళ్ళిన మరో నటి రమ్యకృష్ణ. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక, సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో, సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. వంశం, కలశం, రాజకుమారి వంటి సీరియల్స్‌తో రమ్మకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆతరువాత మళ్లీ సినిమా అవకాశాలు వరుసగా రావడంతో వెండితెరపై బిజీ అయిపోయింది. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

47

30 ఏళ్ళు దాటాక హీరోయిన్ మీనాకు కూడా సినిమా అవకాశాలు తగ్గాయి. దాంతో మీన తమిళ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. సన్ టీవీలో 'లక్ష్మి' సీరియల్‌లో నటించారు. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన మీనా, కొన్నేళ్ళ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా ఆమె తల్లి పాత్రలు చేయడంలేదు. దృశ్యం లాంటి సినిమాల్లో సీనియర్ హీరోలకు జంటగా నటిస్తోంది.

57

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జంటగా నటించి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యింది దేవయాని. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన దేవయాని..పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గిన తరువాత సీరియల్స్ వైపు వెళ్లింది. సన్ టీవీలో 'కోలంగాళ్ళు' సీరియల్ 1000 ఎపిసోడ్స్ కి పైగా నడిచింది. తర్వాత ముత్తారం, రాజాతి వంటి సీరియల్స్‌లో నటించారు. కొన్ని సీరియల్స్ లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు దేవయాని. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో యంగ్ హీరోలకు తల్లి పాత్రలు చేస్తున్నారు.

67

80, 90 లలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన బానుప్రియ, ఈ హీరోయిన్ కూడా తెలుగు, తమిళ భాషల్లలో స్టార్ హీరోలందరితో నటించింది. ఇక పెళ్లయ్యాక ఫారెన్ లో సెటిల్ అయిన భాను ప్రియ, భర్తతో విడిపోయిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చింది. 

అప్పుడు అవకాశాలు లేక తన కూతురి కోసం సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. పెన్, శక్తి, మనసే మంత్రం, దైవం, పుట్టినిల్లు, లాంటి తమిళ సీరియల్స్ లో నటించింది భానుప్రియ. ఆతరువాత ఆమెకు సినిమా అవకాశాలు మళ్లీ వచ్చాయి. దాంతో కొన్నాళ్లు తల్లి పాత్రలు చేసిన ఈ నటి.. ప్రస్తుతం అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారు.

77

బానుప్రియ లాగే, సీత కూడా పార్తిబన్ తో విడాకుల తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో, సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. వేలన్, సమరసం, పెన్, ఇదయం వంటి తమిళ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో అమ్మ పాత్రలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. 

ఇక తెలుగు, తమిళ ఆడియన్స్ కు బాగా తెలిసిన మరో హీరోయిన్ కుష్బు. ఈ హీరోయిన్ కు తమిళంలో ఏకంగా గుడే కట్టారు. ప్రేక్షకులు ఆరాధించే ఈనటి సినిమా అవకాశాలు తగ్గినప్పుడు, సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు. కల్కి, లక్ష్మి స్టోర్స్ వంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకొంత మంది హీరోయిన్లు సినిమాలు వదిలి సీరియల్స్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories