ఛార్మితో పార్ట్నర్ షిప్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెడితే అసలు మ్యాటర్ పోతోంది. కాబట్టి ఇకపై తాను దర్శకత్వానికి మాత్రమే పరిమితమై ఉండాలి అని పూరి జగన్నాధ్ నిర్ణయానికి వచ్చారట. ఇకపై పూరి జగన్నాధ్, ఛార్మి పార్ట్నర్ షిప్ లో సినిమాలు ఉండే అవకాశం లేనట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల పాటు పూరి జగన్నాధ్, ఛార్మి పార్ట్నర్ షిప్ కొనసాగింది. జ్యోతి లక్ష్మి చిత్రం నుంచి పూరి, ఛార్మి నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.