ఇలాంటి అనేక రూమర్లు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై టీమ్ స్పందించింది. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే వార్తలపై స్పందిస్తూ, ఈ రూమర్లు అన్ని నిజం కావు అని, అవన్నీ ఫేక్ న్యూస్ అని వెల్లడించింది. ఈ సినిమా ఆగిపోలేదని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏ అప్ డేట్ అయినా తాము అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తప్పుడు వార్తలు, రూమర్లని నమ్మవద్దు అని, ఎలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ చేయోద్దని తెలిపింది. తమపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.