ఈ క్రమంలో తాజాగా ఎస్కేఎన్ స్పందించారు. తన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చాడు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఈక్రమంలో తాము ఎంత మంది హీరోయిన్లని పరిచయం చేశామో తెలిపారు. `ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేసిన తక్కువ మంది నిర్మాతల్లో నేను ఒకడిని.
రేష్మ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత వీళ్లందరిని ఇప్పటి వరకు పరిచయం చేశాను. వీరితోపాటు నెక్ట్స్ రాబోతున్న సినిమాల్లో హారిక, మరో కొత్త అమ్మాయి ఉంది. ఇలా ఎనిమిది తొమ్మిది మందిని పరిచయం చేశాను. ఈషారెబ్బా, ప్రియావర్మ, ఇనయ ఇలా ఇంకొంత మంది ఉన్నారు.
నేను చేసిన సినిమాల్లో దాదాపు 80శాతం తెలుగు అమ్మాయిలతోనే చేశాను. ఇప్పుడు ఓ టార్గెట్ పెట్టుకున్నారు. జర్నలిస్ట్ నుంచి వచ్చాను, కాబట్టి ఇప్పుడు ఓ టార్గెట్ పెట్టుకున్నాను. ఒక 25 మంది అమ్మాయిలను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు.
హీరోయిన్లనే కాదు, ఇతర డిపార్ట్ మెంట్లలోనూ రైటర్గా, ఎడిటర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, డైరెక్టర్గా, ఇలా ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే, నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న.
అందులో భాగంగా ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఆర్ట్ డైరెక్టర్, రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా తెలుగు అమ్మాయే ఉంది. జస్ట్ ఫన్ యాంగిల్లో చెప్పిన ఒక కామెంట్ని ఒక స్టేట్మెంట్లాగా ప్రమోట్ చేయోద్దని నా కోరిక.
జోక్ని జోక్లాగే తీసుకోండి తప్ప, స్టేట్మెంట్లాగా పాస్ చేయోద్దని కోరుకుంటున్నా` అని తెలిపారు ఎస్కేఎన్. ట్రోలర్స్, మీడియా దెబ్బకి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏది జరిగినా, మొత్తంగా తెలుగు అమ్మాయిలకు మంచే జరుగుతుండటం విశేషం. ఇది అభినందనీయం.
read more: Daaku Maharaj: ఊర్వశీ రౌతేలా పై మరోసారి ట్రోలింగ్, ఆడేసుకుంటున్నారు
also read: రామ్ చరణ్ కోసం సెంటిమెంట్ ను త్యాగం చేసిన సుకుమార్, ఏం చేయబోతున్నాడంటే? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో సిని