Intinti Gruhalakshmi: విక్రమ్ ని తప్పుపడుతున్న దివ్య.. ఆట మొదలుపెట్టిన రాజ్యలక్ష్మి!

Published : Apr 20, 2023, 09:11 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్  కి గట్టి పోటీని ఇస్తుంది. సవతి కూతురు జీవితాన్ని డబ్బుకి తాకట్టు పెట్టిన ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Intinti Gruhalakshmi: విక్రమ్ ని తప్పుపడుతున్న దివ్య.. ఆట మొదలుపెట్టిన రాజ్యలక్ష్మి!

ఎపిసోడ్ ప్రారంభంలో మావయ్య గారిని పెళ్లికి తీసుకురావాల్సింది సంతోషించేవారు కదా నీదే తప్పు అంటుంది దివ్య. మొదటిసారి ఒక గొంతుక నా తరఫున మాట్లాడుతుంది అనుకుంటాడు ప్రకాశం. పక్షవాతం వచ్చిన దగ్గరనుంచి నాన్న ఇదే గదిలో ఉండిపోయారు అంటాడు, నేను చెప్పినా వినరు అంటాడు విక్రమ్. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను వినలేదు అందుకని వదిలేసావా గట్టిగా ప్రయత్నించి నన్ను సాధించుకున్నావు అలాంటప్పుడు మావయ్య గారిని మాత్రం ఎందుకు వదిలేసావు. 

27

ఇంటి పెద్ద మామయ్య గారు ఆ పెద్దరికం చీకట్లో ఉండిపోతే ఎలాగా ఈరోజు నుంచి ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క. మిమ్మల్ని చూసుకోవటానికి దివ్య వచ్చేసింది. మీకు ఏమీ భయం లేదు అని ధైర్యం చెబుతుంది దివ్య. నా కన్న కొడుకు కూడా నాకు ఇంత భరోసా ఇవ్వలేదు అని మనసులో ఆనందపడతాడు ప్రకాశం. రేపటి నుంచి మావయ్య గారి పనులన్నీ నేనే చేస్తానంటుంది దివ్య. మళ్లీ వస్తాము అంటూ అక్కడ నుంచి బయలుదేరుతారు దివ్య దంపతులు. మరోవైపు లాస్య, రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి నువ్వు అనుకున్న పని అయింది కదా అంటుంది.
 

37

ఇక్కడితో నీ పని అయిపోలేదు అంటుంది రాజ్యలక్ష్మి. మనం మాట్లాడుకున్నదే ఇక్కడ వరకే అయినా కూడా నేను ఈ ఇంట్లోనే మనిషి గానే ఉంటాను. ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు చెప్తాను అంటూ నందు వాళ్ళు అక్కడికి వస్తున్న విషయం చెబుతుంది. రానీ చెప్తాను మళ్ళీ ఈ ఇంటికి రాకుండా చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది రాజలక్ష్మి. వెనక్కి తిరిగేసరికి నందుని చూసి షాక్ అవుతుంది లాస్య. ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ అనుమానంగా అడుగుతాడు నందు. రాజ్యలక్ష్మి గారితో మీరు వస్తున్నారని చెప్తున్నాను అంతే అంటుంది లాస్య. 

47

ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు నందు. పెళ్లి ముందు వరకు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు అంటూ అనుమాన పడుతుంది లాస్య. మరోవైపు టీ తీసుకువచ్చిన ప్రియ తో నా ముందే కాదు ఇంట్లో అందరూ ముందు ఇంతే మౌనంగా ఉండు నువ్వు గీత దాటితే నీ తల్లిదండ్రులు లోకాన్ని దాటుతారు అంటూ బెదిరిస్తుంది రాజ్యలక్ష్మి. మరోవైపు తన రూమ్స్ సర్దుకుంటున్న దివ్య దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటాడు విక్రమ్. అలాంటివన్నీ ఇప్పుడు కాదు అంటూ ఇప్పుడు కాదు అంటూ ఏడిపిస్తుంది దివ్య.

57

అంతలోనే అక్కడికి ప్రియ టీ తీసుకొని రావటంతో సిగ్గుతో బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. ఎలా ఉంది నీ కాపురం అని అడుగుతుంది దివ్య. ఇక్కడే ఉంటాను కదా మీరే చూద్దురుగాని అంటూ టీ కప్ తీసుకొని వెళ్ళిపోతుంది ప్రియ. మరోవైపు రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు నందు దంపతులు. ఇలా వచ్చారేంటి అంటుంది రాజ్యలక్ష్మి. తాహతుకు మించి పెళ్లి చేశారు కదా లెక్కలు తేడా వచ్చి ఉంటాయి బంగారు బాతులంటే మా అక్కని చూసేసరికి ఆశ పుట్టి ఉంటుంది అందుకే వచ్చి ఉంటారు అంటాడు బసవయ్య. 

67

ఆ మాటలకి షాక్ అవుతారు నందు దంపతులు. మేము మధ్యతరగతి వాళ్ళమే కానీ ఒకరి దగ్గర చేయి చాపే వాళ్ళం కాదు మేము ఈ రాత్రికి శాంతి ముహూర్తం పెట్టించాము పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చాము మీరు తీరిగ్గా తరువాత రండి అంటుంది తులసి. మీ పద్ధతులు ప్రకారం నడుచుకోవడం ఏంటి మాకు కూడా పద్ధతులు ఉంటాయి కదా అంటుంది రాజ్యలక్ష్మి. ముందు సత్యనారాయణ వ్రతం చేసిన తరువాత అప్పుడు ఫస్ట్ నైట్. అది కూడా మా ఇంట్లోనే జరుగుతుంది అంటుంది రాజ్యలక్ష్మి. అందుకు షాక్ అయిన తులసి ఎక్కడైనా ఆ కార్యక్రమం ఆడపిల్ల పుట్టింట్లో జరుగుతుంది అంటుంది. మగ పెళ్లి వాళ్ళ పద్ధతులు ఏవైతే అవే ఫాలో అవ్వాలి అంటాడు బసవయ్య.

77

తరువాయి భాగంలో దివ్యని చూడాలి ఎక్కడ ఉంది అని అడుగుతుంది తులసి. మీ అమ్మాయిని ఎలా చూసుకుంటున్నాము అని అనుమానంగా ఉందా తను ఇక్కడ బాగానే ఉంది అని చెప్పి తులసి వాళ్ళని పంపించేస్తుంది  రాజ్యలక్ష్మి. దివ్య వచ్చి అమ్మ వాళ్ళు ఏరి అని అడుగుతుంది. రావడము అయింది వెళ్లిపోవడం కూడా అయింది అంటుంది రాజ్యలక్ష్మి. షాక్ లో ఉండిపోతుంది దివ్య.

click me!

Recommended Stories