మరో తెలుగు సినిమా `కపుల్ ఫ్రెండ్లీ` ఇండియా వైడ్గా టాప్ 8లో ట్రెండ్ అవుతుంది. సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటించిన ఈ మూవీకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. అజయ్ కుమార్ రాజు నిర్మించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో బాగానే ఆడింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ములేపుతుంది. చాలా రోజులుగా టాప్ 10లో ట్రెండ్ అవుతుంది.
వీటితోపాటు శశికుమార్, చైత్ర జే అచర్ జంటగా నటించిన `మై లార్డ్` మూవీ టాప్ 9లో ట్రెండ్ అవుతుండగా, `యంగ్ షేర్లాక్` అనే హాలీవుడ్ చిత్రం టాప్ 10లో నిలిచింది. ఇలా ప్రైమ్లో ఇండియా వైడ్గా టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాలు, రెండు హిందీ చిత్రాలుండగా, 3 హాలీవుడ్ మూవీస్ ఉండగా, ఒక వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతున్నాయి.