ఇంత సొగసు ఉంటే బాపు బొమ్మ కాక మరేంటి.. పాలసముద్రం నుంచి వచ్చిన దేవకన్యలా ప్రణీత

First Published Jan 28, 2023, 11:07 AM IST

క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 

క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.  

ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది. 

ఇదిలా ఉండగా ప్రణీత 2021 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగుళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

తాజాగా ప్రణీత తన సొగసుతో మురిపించే ఫోజులు ఇచ్చింది. ఆమె స్కిన్ టోన్ చూస్తే కుర్రాళ్ళ హృదయాలు జారిపోవడం ఖాయం. పాల సముంద్రం నుంచి వచ్చిన దేవకన్యలా అద్భుతమైన మెరుపుతో ప్రణీత మైమరిపిస్తోంది. 

ఇంత సొగసు ఉంటే బాపు బొమ్మ కాక మరేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ప్రణీత అందం సీక్రెట్ ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

ఇదిలా ఉండగా ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉందా అనే ప్రచారం కూడా మొదలయింది. అందుకే ఇలా సోషల్ మీడియాలో హాట్ షోకి తెరలేపింది అని కామెంట్స్ చేస్తున్నారు. 
 

click me!