'ది రాజా సాబ్' ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తన రాబోయే సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమా మేకర్స్ ఓ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇంతలోనే సినిమా సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఫోటోలు లీక్ చేయవద్దని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
25
ఫౌజీ' సినిమాపై భారీ అంచనాలు
ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమాపై భారీ అంచనాలున్నాయి. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడంతో, మేకర్స్ ఒక పోస్ట్ పెట్టారు. "#ఫౌజీ సెట్స్ నుంచి లీకైన ఫోటోలను కొన్ని అకౌంట్లు సర్క్యులేట్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీన్ని తీవ్రమైన హెచ్చరికగా పరిగణించండి. మళ్లీ ఇలా జరిగితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని రాసుకొచ్చారు.
35
ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడు?
'ఫౌజీ' అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్, ఇమాన్వితో పాటు మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా నటిస్తున్నారు.
ప్రభాస్ రాబోయే రోజుల్లో చాలా సినిమాల్లో కనిపించనున్నాడు. 'ఫౌజీ'తో పాటు 'కల్కి 2898 ఏడీ 2', 'సలార్ పార్ట్ 2', 'స్పిరిట్' చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో ప్రస్తుతం 'స్పిరిట్' రిలీజ్ డేట్ మాత్రమే ఖరారైంది. సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలోని ఈ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది.
55
డిజాస్టర్ సినిమా చేసిన ప్రభాస్..
ప్రభాస్ చివరిగా ఈ ఏడాది విడుదలైన 'ది రాజా సాబ్' సినిమాలో కనిపించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రూ.400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.