ఓ వైపు తండ్రి చనిపోయి ఉన్నాడు, మరోవైపు ఆసుపత్రిలో రైటర్‌.. అలాంటి పరిస్థితుల్లో ప్రభాస్‌ ఏం చేశాడో తెలుసా?

Published : Feb 25, 2025, 08:45 AM IST

ప్రభాస్‌ ఎంత గొప్ప మనసునో, ఆయన ఎంత మంచి వ్యక్తినో అందరికి తెలిసిందే. కానీ తండ్రి చనిపోయి ఉన్నప్పుడు కూడా తనకు సహాయం చేశాడుప్రభాస్‌ అని వెల్లడించారు రైటర్‌. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. 

PREV
14
ఓ వైపు తండ్రి చనిపోయి ఉన్నాడు, మరోవైపు ఆసుపత్రిలో రైటర్‌..  అలాంటి పరిస్థితుల్లో ప్రభాస్‌ ఏం చేశాడో తెలుసా?
Prabhas

ప్రభాస్‌ అంటేనే గొప్ప మనసు, విశాలమైన హృదయం, నిజంగానే రాజు అంటుంటారు. ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని రకరకాలుగా వర్ణిస్తుంటారు. అన్నింటికి ఆయన అర్హులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన్ని దగ్గరుంచి చూసినవారే కాదు, బయటి నుంచి చూసిన వాళ్లు కూడా ఇదే చెబుతారు. ఎందుకంటే ఆయన అలాంటి పనులే చేస్తారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, తనని నమ్మిన వారికి సహాయం చేయడంలో, ఇచ్చిన మాట కోసం నిలబడటంతో, తన వాళ్లని తనదైన స్టయిల్‌లో సర్‌ప్రైజ్‌ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఇండస్ట్రీ తరఫున ఏ సహాయం చేయాలన్నా, పై స్థాయిలో ప్రభాస్‌ సహాయమే ఉంటుంది. అందుకే ఇండస్ట్రీలో ఆయనది పెద్ద చేయి అంటారు. 
 

24

అయితే తాను విషాదంలో ఉన్నా, తాను బాధలో ఉన్నా కూడా ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు తనవంతు కృషి చేస్తారు. చేసి చూపిస్తారు. తాజాగా ప్రముఖ రైటర్‌ తోట ప్రసాద్‌.. డార్లింగ్‌ చేసిన సహాయాన్ని బయటపెట్టాడు. ఆ సమయంలో ప్రభాస్‌ తీవ్ర విషాదంలో ఉన్నారని, అయినా తనకు సాయం చేశాడని తెలిపారు. మరి ఇంతకి ప్రభాస్‌ చేసిన సాయమేంటి? ఆయనకు ఏం జరిగిందనేది చూస్తే. 
 

34

2010లో ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజు కన్నుమూశారు. దీంతో ప్రభాస్‌ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో ఉంది. కానీ అలాంటి సమయంలో కూడా తన సినిమా రైటర్‌కి సహాయం చేశాడట ప్రభాస్‌. `2010లో ఫిబ్రవరిలో శివరాత్రికి ముందు రోజు నేను ఆసుపత్రిలో చేరాను. అదే రోజు ప్రభాస్‌ తండ్రి చనిపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు చాలా పెద్ద లాస్‌ అది. ఆ సమయంలో కూడా గుర్తు పెట్టుకుని ఆయన నాకు ఆర్థికంగా సహాయం అందించాడు. పర్సనల్‌గా కేర్‌ తీసుకున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఇంకెవరూ మరో వ్యక్తి గురించి ఆలోచించరు, అసలు పట్టించుకోరు. కానీ నా సినిమా రైటర్‌ ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రభాస్‌ రెస్పాండ్‌ అయ్యాడు. అలాంటి మంచి వ్యక్తి ప్రభాస్‌. అలాంటి గొప్ప వ్యక్తితోమళ్లీ కలిసి పనిచేసే అవకాశం `కన్నప్ప` సినిమాలో దొరికింది` అని వెల్లడించారు తోట ప్రసాద్‌. 
 

44
Prabhas

తోట ప్రసాద్‌.. `బిల్లా`, `వరుడు`, `143` వంటి చాలా సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ఇప్పుడు `కన్నప్ప` చిత్రానికి రైటర్‌గా వర్క్ చేస్తున్నారట. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజా సాబ్‌`, `ఫౌజీ` చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. అనంతరం `స్పిరిట్‌` మూవీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. 

read  more: `పుష్ప 2` చూసి సగం మంది స్టూడెంట్స్ చెడిపోయారు, హెడ్‌మాస్టర్‌ ఆవేదన.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్

also read: రజనీకాంత్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? దానికోసం అర్థరాత్రి మారువేషంలో వాళ్లింటికి వెళ్లేవాడా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories