`పుష్ప 2` సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1871కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఈ లెక్కన ఇది బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. `దంగల్` తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సుకుమార్ రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే.