Pooja Hegde: వైట్‌ గౌనులో పూజా నయా అందాలతో రచ్చ.. `సైమా`లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా బుట్టబొమ్మ.. ఫోటోలు వైరల్‌

First Published Sep 11, 2022, 4:58 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ `సైమా`లో సందడి చేసింది. ఈ అవార్డు ఫంక్షన్‌కే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవడం విశేషం. 
 

పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ `సైమా2022`లో సందడి చేసింది. సౌత్‌ ఇండియా మూవీ అవార్డ్స్ ఈ ఏడాదికిగానూ బెంగుళూరులో జరిగాయి. రెండు రోజులపాటు జరిగే ఈ అవార్డు ఫంక్షన్‌లో మొదటిరోజు(శనివారం) తెలుగుకి సంబంధించిన అవార్డులను ప్రధానం చేశారు.
 

ఇందులో తెలుగు నుంచి బిగ్‌ స్టార్స్ పాల్గొన్నారు. అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండతోపాటు హీరోయిన్లు పాల్గొన్నారు. వారిలో స్టార్‌ హీరోయిన్‌ పూజా ఉన్నారు. ఆమె వైట్‌ గౌన్‌లో మెరవడం విశేషం. జబ్బల గౌనులో టాప్‌ షో చేస్తూ మంత్రముగ్దుల్ని చేసింది. సైమా అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

వైట్‌ గౌన్‌లో హోయలు పోతూ చూపురులను కట్టిపడేసింది. సిగ్గులు మొగ్గేస్తూ ఆమె ఇచ్చిన పోజులు సెలబ్రిటీలను సైతం ఫిదా చేశాయి. ఇక ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే నవ్వులు, కొంటే పోజులు తెగ ఆకట్టుకోవడమే కాదు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతగా రచ్చ చేసిందీ అందాల భామ. 
 

పూజా హెగ్డే ఇందులో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌` చిత్రానికి గానూ పూజాకి ఉత్తమ నటిగా సైమా అవార్డు దక్కడం విశేషం. ఈ సందర్భంగా అవార్డు తీసుకుంటూ తన ఆనందాన్ని పంచుకుంది పూజా. అవార్డు వచ్చిన ఆనందంలో మురిసిపోతూ ఆమె దిగిన పిక్స్ ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మహేష్‌బాబుతో కలిసి త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు విజయ్‌ దేవరకొండతో `జనగణమన` చిత్రంలో నటిస్తుండగా, ఇది ప్రస్తుతానికి ఆగిపోయింది. మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తుంది పూజా. 
 

టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా పేరుతెచ్చుకున్న పూజా హెగ్డే కమర్షియల్‌ సినిమాలకు, స్టార్‌ హీరోలకు హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమెది మొన్నటి వరకు గోల్డెన్‌ లెగ్‌గా అంతా పిలుచుకున్నారు. ఆమె నటిస్తే సినిమా హిట్టే అనే పేరు పడిపోయింది. 
 

కానీ సెంటిమెంట్‌కి ఇప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడినట్టుంది. పూజా నటించిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలవుతున్నాయి. `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సినిమా ఏకంగా క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో ఆమెపై ఉన్న గోల్డెన్‌ లెగ్‌ సెంటిమెంట్‌కి బ్రేక్‌ పడ్డట్టయ్యింది. 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ `సైమా`లో సందడి చేసింది. ఈ అవార్డు ఫంక్షన్‌కే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవడం విశేషం. 
 

click me!