హీరోలతో పనిలేదంటున్న రష్మిక, పూజా, సమంత, కీర్తిసురేష్‌.. కొత్త ఏడాదిలో దుమ్ములేపేందుకు ప్లాన్‌..

First Published Jan 3, 2024, 8:25 PM IST

సినిమా చాలా వేగంగా మారిపోతుంది. సినిమాల్లో ట్రెండ్‌ మారిపోతుంది. సరికొత్త ట్రెండ్‌కి రష్మిక, పూజా, సమంత, కీర్తిసురేష్‌ వంటి కథానాయికలు రెడీ అవుతున్నారు. 
 

హీరోయిన్‌ అంటే హీరోతో డ్యూయెట్లు పాడుకోవడం మాత్రమే కాదు, సినిమాని నడిపించడం కూడా అని అంటున్నారు నయా హీరోయిన్లు. సినిమాని తమ భుజాలపై మోయగలమని నిరూపిస్తున్నారు. ఇక హీరోతో పనిలేదంటున్నారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. నిజానికి ఈ మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే నడుస్తుంది. కానీ హీరోయిన్‌గా సీనియర్‌ అయ్యాక, కమర్షియల్‌ సినిమాలు చేయలేని పరిస్థితుల్లో, హీరోలకు దీటుగా ఇమేజ్‌ని పెంచుకున్నాక ఇలాంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసేవాళ్లు. 
 

కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. కెరీర్‌ ముగింపు దశ వరకు కాదు, మధ్యలోనే చేస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తున్నారు. మెప్పిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఎప్పుడో ఈ ట్రెండ్‌ ప్రారంభించింది. కొనసాగిస్తుంది. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, మరోవైపు స్టార్‌ హీరోల సరసన నటిస్తూ, కమర్షియల్‌ చిత్రాలు చేస్తుంది. 

Latest Videos


ఇప్పటికే `మహానటి`, `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`, `గుడ్‌ లక్‌ సఖీ`, `సానీ కాయిదమ్‌` చిత్రాలు చేసింది. ఇప్పుడు `రఘు తాత`, `రివాల్వర్‌ రీటా` సినిమాల్లో నటిస్తుంది. తమిళంలోనే నాలుగు సినిమాలు చేస్తుండగా, అందులో మూడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ కావడం విశేషం. ఓ రకంగా ఈ విషయంలో కీర్తి సురేష్‌ స్పీడుమీదుందని చెప్పొచ్చు. ఈ చిత్రాలన్నీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ఓ రకంగా ఏడాది మొత్తం కీర్తిసురేష్‌ రచ్చ నెక్ట్స్ లెవల్‌ లో ఉండబోతుందని చెప్పొచ్చు. 

ఈ జాబితాలో లేటెస్ట్ గా పూజా హెగ్డే కూడా చేరింది. ఇన్నాళ్లు కమర్షియల్‌ చిత్రాలతో మెప్పించింది. లక్కీ లెగ్‌నుంచి, ఐరన్‌ లెగ్‌ అనే ట్యాగ్‌ ని ఫేస్‌ చేసింది. దీంతో ఇప్పుడు రూట్‌ మార్చింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. తాజాగా ఈ భామ తమిళంలో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. `కోబ్రా` ఫేమ్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుందని, ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుందని తెలుస్తుంది. ఈ ఏడాది పూజాని లేడీ ఓరియెంటెడ్‌ కథలో చూడబోతున్నామని చెప్పొచ్చు. 
 

దీంతోపాటు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కూడా ఈ జాబితాలో చేరింది. ఆమె ఓ వైపు పాన్‌ ఇండియా చిత్రాలతో దుమ్మురేపుతుంది. అంతలోనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. `రెయిన్‌బో`, అలాగే `ది గర్ల్ ఫ్రెండ్‌` అనే చిత్రంలో నటిస్తుంది. రెండు ప్రేమ కథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ మూవీస్‌. ఇందులోనూ రష్మికనే మెయిన్‌ లీడ్‌. `రెయిన్‌బో` చిత్రానికి శాంతరుబన్‌ దర్శకుడు. `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రానిక రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్టర్‌. ఈ రెండు చిత్రీకరణలో ఉన్నాయి.ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. 

సమంత.. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో రాణిస్తుంది. `యశోద`, `యూటర్న్`, `శాకుంతలం` వంటి సినిమాల్లో నటించింది. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`తోనూ మెప్పించింది. ఇప్పుడు `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సమ్మర్‌లో విడుదల కాబోతుంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నా, డామినేటింగ్‌ అండ్‌ ఎలివేటింగ్‌ రోల్‌ సమంతదే. ఓ రకంగా తనే వెబ్‌ సిరీస్ కి లీడ్‌. ఇలా ఈ ఏడాది సమంత కూడా మరోసారి లేడీ ఓరియెంటెడ్‌ వెబ్‌సిరీస్‌తో మెప్పించబోతుందని చెప్పొచ్చు. 
 

click me!