హ్యాపీగా ''ఫస్ట్ టైం'' మూవీ ఈవెంట్ జరుగుతోంది. ముఖ్య అతిధిగా వచ్చిన స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. తెలుగు సినిమాల విషయంలో రియలైజ్ అయిన పాయల్..వీలేకరి అడిగిన ప్రశ్నకు కన్నీళ్లు ఆపుకోలేక విలపిస్తూ.. వెళ్లిపోయారు.
తన ప్రియుడు సౌరభ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్స్ ను దగ్గరుండి చేస్తోంది పాయల్ రాజ్ పుత్. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలకు గ్యాప్ రావడానికి కారణం తన తప్పే అని ఒప్పుకుంది పాయల్. తన తండ్రి మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లడంతో కొంత గ్యాప్ వచ్చిందని, దాంతో పాటు టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను అందుకోవడంతో మిస్ట్రేక్ చేశానని పాయల్ అన్నారు. స్టోరీ సెలక్షన్, సినిమాల ఎంపిక విషయంలో ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానన్నారు. టాలీవుడ్ నుంచి మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఇక సౌరభ్ మంచి నటుడు, హార్డ్ వర్క్ చేస్తాడు. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు మిస్ అవ్వనని పాయల్ వెల్లడించారు.
25
సినిమా ఈవెంట్ లో పాయల్ రాజు్ పుత్ కన్నీళ్లు..
ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ ఉండే ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఫస్ట్ టైమ్ ఓ స్టేజ్ పై కన్నీటిపర్యంతం అయ్యారు. దుఃఖాన్ని ఆపుకోలేక.. బోరున విలపించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమోషనల్ అయిపోయిన పాయల్.. కన్నీటిని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఏడుస్తూనే కొద్దిసేపు సమాధానం చెప్పిన ఆమె.. ఆతరువాత అక్కడ ఉండలేకపోయారు.
వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ.. సినిమా ఈవెంట్ నుంచి వెళ్లిపోయారు. ''ఫస్ట్ టైం'' సినిమా ఈవెంట్ లో జరిగిన ఈ సంఘటన అందరిని షాక్ కు గురిచేసింది. అక్కడున్నవారు పాయల్ ను చూసి ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఆమె అలా అయిపోవడానికి కారణం ఆమె తండ్రి ప్రస్తావన రావడమే.
35
ఫ్రెండ్ సినిమాకు పాయల్ ప్రమోషన్..
వివరాల్లోకి వెళ్తే, పాయల్ రాజ్ పుత్ క్లోజ్ ఫ్రెండ్, రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్న సినిమా 'ఫస్ట్ టైం'. ఈ సినిమా ప్రమోషన్స్ ను పాయల్ స్వయంగా నిర్వహిస్తున్నారు. తన ఫ్రెండ్ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా ఈవెంట్కు పాయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ వచ్చారు. కానీ సడెన్ గా ఓ వీలేకరి తన తండ్రి గురించి, ఆమె అనారోగ్యం గురించి అడగటంతో పాయల్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. పాయల్ ఎమోషనల్ అయ్యారు. ఈమధ్య కాలంలో తాను ఫేస్ చేసిన కష్టాల గురించి, ముఖ్యంగా తన తండ్రి మరణం గురించి గుర్తు చేసుకుంటూ.. ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. "నా రియల్ హీరో మా నాన్నే. వచ్చే నెలతో ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది, లాస్ట్ ఇయర్ మా నాన్న విమల్ రాజ్ పుత్ క్యాన్సర్ తో మరణించారు." అంటూ బోరున విలపించింది పాయల్ రాజ్ పుత్. అక్కడ ఉన్నవాళ్లు ఎంత ఓదార్చినా.. ఆమె కూల్ అవ్వలేకపోయింది.
55
తండ్రిమరణంతో డిప్రెషన్ లోకి..
పాయల్ మాట్లాడుతుతూ.. '' మా నాన్న చనిపోవడం నేను తట్టుకోలేకపోయాను.. ఆ ఒత్తిడితో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లాను.. దాని నుంచి బయటపటానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం.. ఆయన నన్ను ఎంతో ప్రేమించేవారు. నా సినిమాలను ఎంతో ఇష్టంగా చూసేవారు. బోల్డ్ సినిమా అయినప్పటికీ 'ఆర్ఎక్స్ 100'లో తన నటనను మెచ్చుకున్నారు. చాలా అద్భుతంగా నటించావని అన్నారు. మా నన్నే నా హీరో, అంటూ పాయల్ కన్నీటిపర్యంతం అయ్యారు. పక్కనే ఉన్న వారు ఓదార్చే ప్రయత్నం చేసినా, పాయల్ తన దుఃఖాన్ని అదుపు చేసుకోలేక స్టేజ్ పై నుంచి కిందకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.