ఎన్టీఆర్‌ కూడా నెపోటిజం ప్రాడక్టే.. మీరంతా మూసుకొని ఉండండి!

First Published Jun 29, 2020, 1:37 PM IST

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత నెపోటిజం మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ జూనియర్‌ ఎన్టీఆర్ లాంటి హీరోలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ ఘోష్‌ ఆసక్తికరంగా స్పందించింది.

సుశాంత్ మరణం బాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా నెపోటిజం విషయంలో తెలుగు హీరోల మీద కూడా ట్రోల్స్ మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు నందమూరి హీరోలను కూడా టార్గెట్‌ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ పై వచ్చిన విమర్శలపై నటి పాయల్‌ ఘోష్ స్పందించింది.
undefined
ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ పాయల్‌ ఘోష్, తరువాత ఈ బ్యూటీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ఊసరవెల్లి సినిమాలో నటించింది. తెలుగులో దాదాపు పది సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌ బాట పట్టిన భామ తాజాగా ఎన్టీఆర్‌ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్‌ అయ్యాయి.
undefined
ఇటీవల ఎన్టీఆర్‌ అభిమానులు, మీరా చోప్రా మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఎవరో తెలియదంటూ మీరా చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్‌ ఆమెను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. ఈ వివాదం పోలీస్‌ కంప్లయింట్ వరకు వెళ్లింది.
undefined
అయితే ఈ వివాదంలోకి ఎంటరైన పాయల్‌ ఘోష్‌, ఎన్టీఆర్‌కు మద్దతు తెలిపింది. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవిస్తాడని ఆయన మీద విమర్శలు చేయటం తగదంటూ చెప్పింది. పాయల్ మీద కూడా ట్రోలింగ్ మొదలైంది.
undefined
తాజాగా నెపోటిజం విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా నెపోటిజం ప్రాడక్టే అని మీరు అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ పాయల్‌ను ప్రశ్నించారు నెటిజెన్లు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక పంచుకుంది పాయల్‌ ఘోష్‌.
undefined
వారికి సమాధానం ఇచ్చిన పాయల్‌ ఘోష్. ఎన్టీఆర్‌ని తిట్టేవారికి ఆయన గురించి అస్సలు తెలిసి ఉండదు. అతనో హార్డ్‌ షిప్‌, తన స్వశక్తితో పైకి వచ్చాడు. మీరంతా మూసుకొని ఉండండి` అంటూ తీవ్ర పదజాలంతో కౌంటర్ ఇచ్చింది.
undefined
click me!