వెన్యూ ఫిక్స్ అయ్యాక ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. ఏర్పాట్లు తప్పనిసరిగా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు కాబట్టి సెక్యూరిటీ పటిష్టంగా ప్లాన్ చేస్తారు. ఒకే వేదికపై చాలా కాలం తర్వాత రాంచరణ్, పవన్ కనిపించబోతున్నారు. వీరితో కలసి డైరెక్టర్ శంకర్ కూడా స్టేజిపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్.. రాంచరణ్ నాయక్ మూవీ ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతున్నారు.