అన్న ప్రాసనలో పవన్‌ కళ్యాణ్‌ ఏం పట్టుకున్నారో తెలుసా..? మెగా మదర్ అంజననాదేవి చెప్పిన టాప్ సీక్రెట్

Published : Dec 02, 2024, 09:30 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్ననాటి సంగతులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన అన్న ప్రాసన రోజు ఏం పట్టుకున్నారు. బుక్ ఆర్ పెన్, మనీ ఆర్ గోల్డ్.. ఈ విషయాలు.. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.. ఆయన అమ్మగారు అంజనాదేవి.

PREV
16
అన్న ప్రాసనలో పవన్‌ కళ్యాణ్‌  ఏం పట్టుకున్నారో తెలుసా..? మెగా మదర్ అంజననాదేవి చెప్పిన టాప్ సీక్రెట్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం  పవన్‌ కల్యాణ్‌.  ఆయన ఇమేజ్ ఇంకాస్త పెంచుకున్నారు. ఎన్నో విమర్శలను ఫేస్ చేసి.. కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిన పవర్ స్టార్..ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పరిపాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో  ఆమధ్య పవన్ కళ్యాణ్ గురించి ఆయన అమ్మగారు అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ స్టార్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.  

Also Read: పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్, అవినాష్ కోసం పృథ్వీని బలిచేసిన బిగ్ బాస్, కన్నడ నటుడుకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్
 

26
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆమె ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని శేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అన్న ప్రాసన ఎలా జరిగింది. అనే విషయాన్ని వివరించారు. అంజనాదేవి మాట్లాడుతూ.. మేము ఒకసారి తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లాము. అప్పటికిర పవన్ కళ్యాణ్ వయస్సు ఆరు నెలలు. ఎలాగు ఆరోనెల వచ్చింది కదా.. తిరుమల వచ్చాము కదా.. ఇక ఇక్కడే అన్న ప్రాసన చేద్దాం అని అనుకున్నాము. 

Also Read: ప్రభాస్ డ్రీమ్ రోల్ ఎంటో తెలుసా..? ఇప్పటికీ ఆ పాత్ర కోసం ఎదరుచూస్తోన్న రెబల్ స్టార్..
 

36

నాకు మనసులో అనిపించింది.. వెంటనే పవన్ నాన్నగారు శ్రీ వెంకట్రావు గారితో చెప్పాను. ఆయన కూడా అంత కంటే అదృష్టం ఏముంటుంది చేసేద్దాం అని అన్నారు. తిరుమలలో యోగ నరసింహస్వామి వద్ద పడుకోబెట్టి చేసేద్దామండి అన్నాను. ఆయన పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి పవన్ కు  అన్నప్రాసన చేస్తే.. పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు' అని అంజనాదేవి అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు. 

Also Read: హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?
 

46

ఇక కత్తి పట్టుకున్నాడు కదా  పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికి మంచి చేసేవాడు అవుతాడు అని అప్పుడే మేము అనుకున్నాము. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ఉన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతను చేస్తున్న పని చూసి చాలా సంతోషంగా ఉంది అన్నారు అంజనాదేవి. 

ఈమధ్య పవన్ కళ్యాణ్ ఎక్కువగా   దీక్షలు తీసుకుంటున్నాడు. అయితే అవి అతనికి క కొత్త కాదు అన్నారు అంజనాదేవి. పవన్‌కు చిన్నప్పుట్నుంచే ఆ  అలవాటు ఉంది అన్నారు. పవన్ ఎంతో నిష్టగా  అయ్యప్ప మాల వేసుకునేవాడని ఆమె చెప్పారు. అంతే కాదు ప్రత్యేకంగా తన కోసమే పనవ్ దీక్ష తీసుకున్నాడని అన్నారు పవన్ తల్లిగారు.  అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్న అని ఓసారి అడిగితే.. నా  కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు. 


40 రోజులు నిష్టగా ఉన్నాడు. ఆ తర్వాత శబరిమల వెళ్ళి  దర్శనం చేసుకుని వచ్చాం' అని అంజనాదేవి తెలిపారు.  ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్‌ ఎంతో కష్టపడ్డాడని, ఎంత కష్టపడ్డాడో భగవంతుడు అంత మంచి అదృష్టం ఇచ్చాడని, ప్రజలకే సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడని అంజనాదేవి  ఆనందంతె వెల్లడించారు. 

Also Read: సుబ్బరాజు భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా... ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంటుంది..?
 

56
Pawan Kalyan DCM

పాలిటిక్స్‌లో పవన్‌ కళ్యాణ్  కష్టపడుతుంటే తన మనసు తల్లడిల్లిపోయిందన్నారు అంజనాదేవి. 'షూటింగులు చేసి వచ్చి అలా సోఫాలోనే పడుకుని నిద్రపోయేవాడు. ఒక్కోసారి నేలమీద దిండు వేసుకుని పడుకునేవాడు.  గదిలోనే పడుకోవాలి.. మంచమే కావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ విషయంలో అయినా.. చాలా కష్టపడతాడు. ఎంత కష్టపడినా ఇంత కష్టపడ్డాను అని ఏనాడు చెప్పుకోడు. అంతా తన మనసులోనే పెట్టుకుంటాడు. తిండి విషయంలో కూడా నాకు ఇది కావాలి అని ఏనాడు అడిగేవాడు కాదు. అన్నారు అంజనాదేవి. 
 

66

'మా అబ్బాయిపై వాళ్ల నాన్న గారి ప్రభావమే ఎక్కువగా ఉండేది. ఆయన కూడా కల్యాణ్‌ బాబులాగే  దానధర్మాలు చేసి ఎదుటివారికి సహాయం చేసే వారు. అదే గుణం పవన్‌కు  వచ్చింది. ముగ్గురికీ ఆ గుణం ఉంది. పవన్ కి కొంచం ఎక్కువ. సినిమాల్లో చేసేప్పుడు కూడా అందరికీ సాయం చేసేవాడు' అంటూ పవన్‌ వ్యక్తిత్వం గురించి తెలిపారు. నా బిడ్డ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నానని తల్లి మనసు చాటుకున్నారు అంజనా దేవి.
 

Read more Photos on
click me!

Recommended Stories