
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో `ఓజీ` మానియా నడుస్తోంది. సినిమా రిలీజ్కి ఒక్క రోజే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాకి సంబంధించిన గ్లింప్స్ లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ములేపుతుందీ మూవీ. బెనిఫిట్ షోస్ టికెట్స్ ఓపెన్ చేసిన కొన్నిగంటల్లోనే అమ్ముడు పోయాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ తన పవర్ని చూపిస్తున్నారు పవన్. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో `పుష్ప 2` రికార్డులను బ్రేక్ చేస్తుండటం విశేషం.
`పుష్ప 2` పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. మొదటి భాగం పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి విశేషమైన క్రేజ్ నెలకొంది. అది అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. అయితే `పుష్ప 2` రేంజ్లో `ఓజీ`ని వరల్డ్ వైడ్గా కంపేర్ చేయలేం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కంపారిజన్ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల `పుష్ప 2` రికార్డులను `ఓజీ` మూవీ బ్రేక్ చేస్తుండటం విశేషం.
నైజాంలో పవన్ కళ్యాణ్కి భారీ క్రేజ్ ఉంది. ఇక్కడ ఆయన సినిమాలు భారీగా వసూళ్లు చేస్తుంటాయి. `ఓజీ` కూడా తన సత్తాని చాటింది. ఇక్కడ `పుష్ప 2` రికార్డులను బ్రేక్ చేసింది. ఒక్క రోజు ముందు `ఓజీ` మూవీ రూ.14 కోట్లు రాబట్టగా, `పుష్ప 2` రూ.11 కోట్లు వసూలు చేసింది. దీంతో `పుష్ప 2` రికార్డు బ్రేక్ అయిపోయింది. మరోవైపు ఆంధ్రాలో ప్రీమియర్స్ కి సంబంధించి `పుష్ప 2` రూ.4.36కోట్లు వసూలు చేయగా, `ఓజీ` మూవీ ఐదు కోట్లు దాటేసింది. కర్నూల్లోనూ ప్రీమియర్స్ కి సంబంధించి `పుష్ప2` ని దాటేసింది ఓజీ. గుంటూరులో అడ్వాన్స్ సేల్స్ లో పుష్ప 2.. 188 షోస్కి రూ.1.42కోట్లు వసూలు చేస్తే, `ఓజీ` 160 షోస్కి 1.4కోట్లు సాధించింది.
ఇలా చాలా ఏరియాల్లో `పుష్ప 2` రికార్డులను బ్రేక్ చేస్తోంది `ఓజీ` మూవీ. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్లో సత్తా చాటుతుంది. కానీ ఇతర స్టేట్స్ లో మాత్రం `పుష్ప 2`ని దాటడం కష్టమే అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం నార్త్ అమెరికాలో మాత్రం దుమ్మురేపుతుంది. అక్కడ అడ్వాన్స్ సేల్స్ ఇప్పటికే మూడు మిలియన్స్ దాటింది. అంటే ఓపెనింగే అక్కడ రూ.27కోట్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ` మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్గా చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నేటి రాత్రి నుంచి బెనిఫిట్ షోస్ ప్రదర్శిస్తున్నారు. రేపు గురువారం(సెప్టెంబర్ 25న) గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు.