ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. బాలీవుడ్ భామలు నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఏఎం రత్నం కొడుకు, దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కొన్ని విభేదాల నేపథ్యంలో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు.
కాకపోతే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఏఎం రత్నం అన్నీ తానై చూసుకుంటున్నారు. మేఘ సూర్య ప్రొడక్షన్పై ఏఎంరత్నం, ఏ దయాకర్ రావు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయబోతున్నారు.
Read more:నయనతార, మంజు వారియర్.. పారితోషికంలో టాప్ 7 హీరోయిన్స్
also read: ప్రభాస్ విలన్గా మారేలా చేసిన రాజమౌళి, కత్తి కోసం గొడవ.. డార్లింగ్ చేసిన పనికి జక్కన్నకి ఫ్యూజులు ఔట్