ఇందులో పవన్ చెబుతూ, ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, అర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. నేను ఆయన వద్ద కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది.
వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అంతేకాదు ఈ నెల 29న చెన్నై వెళ్లి హుస్సైనీ ని పరామర్శించాలని, నిర్ణయించుకున్నాను. ఇంతలోనే దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.