ఇంతలోనే సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో మరో చిత్రం ప్రకటించారు. ఈ చిత్రంతో పవన్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ కాకుండా స్ట్రైట్ మూవీ చేస్తున్నారని పవన్ అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఈ సంతోషాన్ని ఆస్వాదించే లోపే మరో న్యూస్ పీకే ఫ్యాన్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది. త్వరలో హరీష్ శంకర్, మైత్రి మూవీస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తేరి చిత్ర రీమేక్ ప్రకటించబోతున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతోంది.