అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ నిన్న(30 ఆగష్ట్) ఉదయం మృతి చెందారు. ఆమె మృతితో మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిరంజీవికి అత్తయ్య కావడంతో మెగా ఫ్యామిలీ అంతా అల్లు వారింటికి వెళ్లి కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. చిరంజీవి కార్యక్రమాలు పర్యావేక్షించారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అల్లు అర్జున్ – తన ఇంట్లో నుంచే అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ తండ్రి అల్లు అరవింద్కు అండగా నిలిచారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ నేతలు అరవింద్ ఇంటికి వచ్చి అల్లు కనకరత్నమ్మకు నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే రోజున అంటే శనివారం విశాఖపట్నంలో పార్టీ బహిరంగ సభలో పాల్గొనాల్సి రావడంతో, అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. సభ ముగిసిన వెంటనే హైదరాబాదు చేరుకున్న పవన్ కళ్యాణ్, రాత్రివేళ అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అరవింద్, బన్నీని పరామర్శించారు. అల్లు కనకరత్నమ్మ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.