దిమ్మతిరిగే అప్డేట్..రెండు భాగాలుగా పవన్ 'ఓజి'.. ఊహకందని క్లైమాక్స్ ప్లాన్ చేసిన సుజీత్

First Published Feb 1, 2023, 9:53 AM IST

పవన్ సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవల ఈ చిత్రం అఫీషియల్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా ఉంటుందని అంటున్నారు.

పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. ఇంతలోనే పవన్ సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చిత్రాన్ని ప్రారంభించారు. 

ఇటీవల ఈ చిత్రం అఫీషియల్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా ఉంటుందని అంటున్నారు. దర్శకుడు సుజీత్.. అసలైన పవన్ కళ్యాణ్ ని ప్రజెంట్ చేసే స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రం గురించి తాజాగా షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఒక పార్ట్ కే ఒప్పుకోవడం కష్టం అయితే రెండు భాగాలకు ఒప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సుజీత్ బలమైన కథతో పవన్ ని సింగిల్ సిట్టింగ్ లోనే ఒపించారట. కథ అదిరిపోయేలా ఉండడంతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఫస్ట్ పార్ట్ ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా లిమిటెడ్ గానే డేట్స్ ఇచ్చారట. మరి తక్కువ సమయంలో సుజీత్ ఫస్ట్ పార్ట్ ని వేగంగా ఎలా ఫినిష్ చేస్తాడు అనేదే ప్రశ్న. అయితే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ మాత్రం ఊహకి అందని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుజీత్ ఈ చిత్రంలో అసలైన పవర్ స్టార్ ని ప్రజెంట్ చేయబోతున్నారట. 

సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగేలా, గూస్ బంప్స్ తెప్పించేలా సుజీత్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ని ప్లాన్ చేశారట. రెండవ భాగాన్ని 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర లాంచింగ్ జరగగా.. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి బడా నిర్మాతలు అతిథులుగా హాజరైన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు కానీ వరుసగా ఓపెనింగ్స్ మాత్రం జరుగుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాల కారణంగా పూర్తి స్థాయిలో తన చిత్రాలకి డేట్స్ కేటాయించలేకున్నారు. హరిహర వీరమల్లు చిత్రం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. సాహో పరాజయం తర్వాత దర్శకుడు సుజీత్ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. 

click me!