అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ రావడం లేదని, ఆయన్ని అప్రోచ్ కాలేదని సమాచారం. ఆల్రెడీ విన్నర్ అయ్యాక మళ్లీ రావడం కష్టం. అయితే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మధ్యలో తీసుకొస్తారా? లేక గెస్ట్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తారా? అనేది చూడాలి. ఇక ఈ సారి హౌజ్లోకి వచ్చే కంటెస్టెంట్లలో దీపికా, తేజస్విని గౌడ, శివ కుమార్, బంచిక్ బబ్లూ, భరణి, సుధాకర్ కోమాకుల, సుమంత్ అశ్విన్, తనూజా, దేబ్జానీ, ఇమ్మాన్యుయెల్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సాయి కిరణ్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, ఆశా షైనీ, నాగదుర్గ వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఐదుగురు కామనర్స్ రాబోతున్నారు.