దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో బ్రహ్మాస్త్రం తెరకెక్కింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్రం విడుదల కానుంది. కింగ్ నాగార్జున, షారుక్ ఖాన్, అమితాబ్, మౌని రాయ్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు.