బ్రేకింగ్: వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేదిక మళ్ళీ మారింది.. ఏంటి ఈ ఇబ్బందులు, తెర వెనుక ఏం జరుగుతోంది..

First Published Jan 7, 2023, 9:24 AM IST

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని నిర్మాతలు జనవరి 8న నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దర్శకుడు బాబీ.. వింటేజ్ మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ప్రీ రిలీజ్ వేడుకని నిర్మాతలు జనవరి 8న నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. అయితే వెన్యూ విషయంలోనే సందిగ్దత నిలకొంది. 

ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగేది విశాఖలోనే.. కానీ వేదిక ఎక్కడ అనే విషయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా నిర్మాతలు ప్రీరిలీజ్ వేడుకని ఆర్కే బీచ్ లోనిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ పోలీసులు అక్కడ  అనుమతి ఇవ్వలేదు. దీనితో వేదిక ఆంధ్ర యూనివర్సిటీకి మారింది. అయితే తాజాగా మరోసారి వేదిక మార్చినట్లు అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ వేడుకని తిరిగి ఆర్కే బీచ్ లోనే నిర్వహించబోతున్నట్లు అప్డేట్ వస్తోంది. 

అక్కడ ప్రీరిలీజ్ ఈవెంట్ కి పోలీసులు అనుమతులు ఇచ్చారట. దీనితో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ లో అనుమతి ఇవ్వాలని నిర్మాతలు పోలీసులని కోరడంతో వారు అనుమతి నిరాకరించారు. ఆదివారం కావడంతో టూరిస్టులు, జనసంచారం ఎక్కువగా ఉంటుంది అని, భద్రతా సమస్యలు వస్తాయని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

ప్రత్యామ్నాయంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో వేదిక ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ తెర వెనుక ఏంజరిగిందో ఏమో.. తిరిగి ఆర్కే బీచ్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతులు లభించాయి. 

Chiranjeevi

నిన్న జరిగిన బాలయ్య వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే తరహా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒంగోలులో మొదట ఒక ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా.. ట్రాఫిక్ సమస్యల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనితో ఒంగోలులోని మరో చోటికి ఈవెంట్ మార్చారు. దీనితో చిత్ర పరిశ్రమకి, ఏపీ ప్రభుత్వానికి తెర వెనుక ఏం జరుగుతోంది అంటూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్ మెగా అభిమానులతో హోరెత్తబోతోంది. 

click me!