Naveen Yerneni: ఎన్టీఆర్-నీల్ సినిమాపై కీలక అప్‌డేట్.. రోజూ రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని..

Published : Mar 18, 2026, 08:06 PM IST

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న 'డ్రాగన్' సినిమాపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. విజువల్ గ్రాండ్‌నెస్ కోసం రోజుకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 

PREV
15
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' అప్‌డేట్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నవీన్ యెర్నేని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'డ్రాగన్' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

25
విజువల్ వండర్‌గా 'డ్రాగన్':

ఈ సినిమా మేకింగ్ గురించి నవీన్ యెర్నేని మాట్లాడుతూ, ప్రేక్షకులకి ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కోసం రోజుకు దాదాపు ఒక కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంతటి భారీ వ్యయంతో కూడిన సినిమా కాబట్టి, కచ్చితంగా విజువల్స్ అసాధారణంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

35
టికెట్ ధరలు, ఫ్లెక్సీ రేట్స్:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల ఇష్యూ గురించి ఆయన స్పందిస్తూ, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం అవసరం అని పేర్కొన్నారు. ఏటా వచ్చే ఐదారు పెద్ద సినిమాలకు మాత్రమే ఈ పెంపు ఉంటుందని, మిగతా సినిమాలకు సాధారణ ధరలే ఉంటాయని స్పష్టం చేశారు.

45
'ఫ్లెక్సీ రేట్స్'

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు 'ఫ్లెక్సీ రేట్స్' విధానాన్ని తీసుకురావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు ఆయన తెలిపారు.

55
రాబోయే భారీ చిత్రాలు

మైత్రీ మూవీ మేకర్స్ లైనప్‌లో 'డ్రాగన్'తో పాటు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ సినిమా, 'ఫౌజీ' వంటి మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఈ విషయంలో సహకరిస్తాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories