నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) నట వారసుడిగా రాణిస్తున్నారు బాలకృష్ణ. ఆయన వారసుల్లో బాలయ్య ఒక్కరే సక్సెస్ అయ్యారు. ఇంత కాలం నటుడిగా రాణిస్తున్నారు. ఆ తర్వాత జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కెరీర్ ప్రారంభంలో బాలయ్య సినిమాల ఎంపిక మొత్తం ఎన్టీఆర్ చేతుల్లోనే ఉండేది. ఆయన సీఎం అయ్యాక కూడా కొడుకు సినిమాలను తనే ఎంపిక చేసేవారు. అయితే ఈ క్రమంలో బాలయ్యకి పనిగట్టుకొని ఫ్లాప్ మూవీ తీశారు ఎన్టీఆర్.
24
ఎన్టీఆర్ మొహం మీదే నచ్చలేదని చెప్పిన దర్శకుడు
ఎన్టీఆర్ 1983లో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. వీలు చూసుకొని షూటింగ్లు చేసేవారు. అప్పట్లో చాలా వరకు సెట్ లు, స్టూడియోలోనే షూటింగ్లు ఉండటంతో ఈజీ అయ్యింది. రెండింటిని బ్యాలెన్స్ చేశారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్.. అప్పట్లో ఓ కథని తీసుకొని ఎన్టీఆర్ వద్దకు వెళ్లారట. వారితోపాటు దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా వెళ్లారు. ఉదయం నాలుగున్నరకి వెళ్లి రామారావుకి కథ చెప్పారు. మీకు ఎలా అనిపించిందని కోదండరామిరెడ్డిని ఎన్టీఆర్ అడగ్గా నచ్చలేదని చెప్పారు. దీంతో ఈ సినిమా వద్దని వెళ్లిపోయారట. మరో కథతో కలుద్దామని రామారావు కూడా చెప్పారు.
34
బాలయ్యతో బలవంతంగా సినిమా చేయించిన ఎన్టీఆర్
ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆరే ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకో ఆ కథ బాగుంటుందనిపిస్తుంది, సినిమా చేద్దామని చెప్పారట. పెద్దాయన చెప్పడంతో కోదండరామిరెడ్డి కూడా కాదనలేకపోయారట. బాలకృష్ణకి చెబితే ఆయన కూడా నచ్చలేదన్నాడట. కానీ నీకేం తెలుసు, సినిమా చేయమని ఎన్టీఆర్ గట్టిగా చెప్పడంతో దాన్ని మొదలు పెట్టారు. షూటింగ్ చేశారు. ఇందులో బాలయ్య పోలీస్ పాత్రలో కనిపిస్తారు. ఓ షాట్ సరిగా రాలేదు. ఆ సీన్ మళ్లీ చేయాలని దర్శకుడు కోరగా, ఫ్లాప్ మూవీకి మరో షాట్ ఎందుకు అదే పెట్టేయండి అన్నాడట బాలయ్య. దెబ్బకి కోదండరామిరెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోయాయట. బాలయ్య కూడా అప్పటికే ఫిక్స్ అయ్యారు ఆ సినిమా పోతుందని.
అన్నట్టుగానే సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారట. 1988 మే 11న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టుగానే డిజాస్టర్గా నిలిచింది. మరి ఇంతకి ఆ సినిమా ఏంటంటే `తిరగబడ్డ తెలుగుబిడ్డ`. నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో భానుప్రియ హీరోయిన్గా నటించింది. సినిమా దారుణమైన పరాజయం చెందిందట. ఈ విషయాన్ని దర్శకుడు కోదండరామిరెడ్డి.. అలీతో సరదాగా షోలో వెల్లడించడం విశేషం.