కృష్ణవేణిది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి. ఆమె సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటిగా రాణించారు. 1936లో ఆమె `సతీ అనసూయ` చిత్రంలో బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు దాదాపు 15 సినిమాల్లో నటించింది. వీటితోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాల్లో `మోహినీ రుక్మాంగద`, `కచదేవయాని`, `మహానంద`, `జీవన జ్యోతి`, `దక్షయజ్ఞం`, `భీష్మ`, `బ్రహ్మరథం`, `మదాలస`, `మనదేశం`, `గొల్లభామ`, `లక్ష్మమ్మ` చిత్రాల్లో నటించి మెప్పించింది.