Actress Jamuna
జమున ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తిరుగులేని ఫేమ్ అనుభవించిన నటి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో జమున చేసిన మిస్సమ్మ, గుండమ్మ కథ టాలీవుడ్ క్లాసిక్స్ అని చెప్పాలి. వెండితెరను ఏలిన ఎన్టీఆర్,ఏఎన్నార్ లనే ఢీ కొట్టింది జమున. ఆత్మాభిమానం కోసం కెరీర్ ని పణంగా పెట్టింది. మరి ఎన్టీఆర్, ఏఎన్నార్ తో ఆమె ఎందుకు విభేదించాల్సి వచ్చిందో ఓ సందర్భంలో జమున వెల్లడించారు.
Actress Jamuna
ఓ ఇంటర్వ్యూ యాంకర్ ఈ వివాదం గురించి అడిగారు. జమున మాట్లాడుతూ... ఏఎన్నార్ తనకు అందరూ వంగి వంగి నమస్కారాలు చేయాలి అనుకునేవారు. నేను ఆ టైప్ కాదు. మనం వ్యక్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయి. ఏఎన్నార్ తాను నన్ను బ్యాన్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ తో కూడా చేయించాడు.
Actress Jamuna
ఎన్టీఆర్, ఏఎన్నార్ నా మీద నిందలు వేశారు. తప్పుడు ప్రచారం చేశారు. జమున పొగరుబోతు. కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. సమయానికి రాదు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పదు వంటి బిరుదులు ఇచ్చారు. మూడేళ్లు నాతో నటించలేదు.
Actress Jamuna
సరే మీరు కాకపోతే మరొకరు నటిస్తారని నేను జగ్గయ్య, హరనాథ్, శ్రీధర్, రమణమూర్తి వంటి కొత్త హీరోలతో సినిమాలు చేశాను. జగ్గయ్య, హరనాథ్ లతో నా కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా హరనాథ్ తో సూపర్ హిట్ సినిమాలు చేశాను.
Actress Jamuna
హరనాథ్ తో నా కాంబినేషన్ హిట్ అయ్యాక అతడు తాగుడుకు అలవాటు పడ్డాడు. ఒకసారి షూటింగ్ కి తాగి వచ్చాడు. నేను నటించను అని సెట్స్ నుండి వెళ్ళిపోయాను. హరనాథ్ భార్య కాల్ చేసి ఇకపై తాగిరాడు మేడం అని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు ఒప్పుకున్నాను. మూడేళ్ళ తర్వాత గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో నేను నటించాను.
Actress Jamuna
గుండమ్మ కథ చిత్రం కోసం నాగిరెడ్డి, చక్రపాణి మా మధ్య సయోధ్య కుదిర్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లను నన్ను కాంప్రమైజ్ చేశారు. అప్పుడు మేము కలిసి నటించాము.. అని చెప్పుకొచ్చారు. 2023 జనవరి 27వ తేదీన హైదరాబాద్ లో జమున కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు 86 ఏళ్ళు.