Peddi Movie: రాంచరణ్ నటించిన పెద్ది చిత్రానికి మరో సమస్య వచ్చింది. తెలంగాణలో టికెట్ ధరల విషయంలో పెద్దికి ఎదురుదెబ్బ తప్పలేదు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
25
థియేటర్ల సమస్య ముగిసింది
అయితే పెద్ది చిత్రాన్ని సమస్యలు కూడా అదే విధంగా చుట్టుముడుతున్నాయి. మొన్నటి వరకు థియేటర్ల పర్సెంటేజీ వివాదం నడిచింది. చిరంజీవి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మరో సమస్య తప్పలేదు. పెద్ది చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
35
టికెట్ ధరలు పెంచేందుకు నో పర్మిషన్
కానీ తెలంగాణలో మాత్రం ఇంకా అనుమతి రాలేదు. చిత్ర నిర్మాతలు ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ హోమ్ సెక్రటరీకి పెద్ది నిర్మాతలు వినతి పత్రం అందించారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో హై కోర్టులో కూడా పిటిషన్ వేశారు.
టికెట్ ధరలపై గత తీర్పులని పరిగణలోకి తీసుకుని హై కోర్టు కూడా స్పందించలేదు. దీనితో నిర్మాతలు తమ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు. నిర్మాతలు వెనక్కి తగ్గడంతో తెలంగాణలో పెద్ది టికెట్ హైక్స్ లేనట్లే అని అంతా భావిస్తున్నారు. వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు వినతి పత్రం అందించారు. అయినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదు.
55
కలెక్షన్స్ పై ప్రభావం
నైజాం అనేది టాలీవుడ్ కి చాలా కీలకమైన ఏరియా. అక్కడ పెద్ది లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకుంటే కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. దీనిపై పెద్ది నిర్మాతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.