సమంత చేతిలో ఒక్క సినిమా లేదు, అయినా ఇండియాలో తనే నెంబర్‌ వన్‌.. వెనకబడ్డ రష్మిక, కాజల్‌, నయనతార

First Published Apr 21, 2024, 9:33 PM IST

సమంత గతేడాది `ఖుషి` చిత్రంతో మెరిసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇప్పుడు ఇండియాలోనే టాప్‌గా నిలవడం విశేషం. 
 

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. గతేడాది సెప్టెంబర్‌లో `ఖుషి` సినిమాతో మెరిసింది. హిట్ అందుకుంది. ఆ వెంటనే ఆమె సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. అప్పట్నుంచి సమంత సినిమాలకు దూరంగా ఉంది. వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటుంది. అన్నీ టెన్షన్స్, బాధలను వదిలేసి రిలాక్స్ గా గడుపుతుంది. అడపాదడపా సోషల్‌ మీడియాలో తప్ప ఆమె బయట కనిపించింది చాలా అరుదు.  

అప్పుడప్పుడు ప్రైవేట్‌ ఈవెంట్లలో మెరుస్తుంది సమంత. కానీ ఇతర హీరోయిన్లు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్‌ ఇండియా చిత్రాలతో సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. కానీ క్రేజ్‌ విషయంలో సమంతతో పోల్చితే వెనకబడిపోయారు. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ పోలింగ్‌ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. మార్చి నెలలో ఇండియా వైడ్‌గా పాపులర్‌, క్రేజ్‌ని, అత్యంత అభిమానాన్ని పొందిన హీరోయిన్లలో సమంత నెంబర్‌ 1గా నిలవడం విశేషం. 

టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్స్ లో సమంత మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రెండో స్థానంలో అలియా భట్‌ నిలిచింది. ఆమె రెండేళ్ల క్రితమే కూతురుకి జన్మనిచ్చింది. ఇటీవల తరచూ భర్త్ రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ముంబయిలో సందడి చేసింది. పైగా ఆమె సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంది. ఇలా రెండో స్థానాన్ని దక్కించుకుంది. 

ఇక మూడో స్థానంలో దీపికా  పదుకొనె నిలవడం విశేషం. ఆమె గతేడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ `పటాన్‌`, `జవాన్‌` చిత్రాలతో సంచలన విజయాలు అందుకుంది. ఇప్పుడు `కల్కి2898ఏడీ`లో నటిస్తుంది. ఈ మూవీ తరచూ చర్చనీయాంశం అవుతుంది. అయినా ఆమె మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. 
 

ఇక నాల్గో స్థానంలో కాజల్‌ నిలిచింది. కాజల్‌ గతేడాది `భగవంత్‌ కేసరి`లో మెరిసింది. పెళ్లై, కొడుక్కి జన్మనిచ్చిన తర్వాత ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ లో నటించిన తొలి చిత్రమది. ఆ తర్వాత ఆమెకి సంబంధించిన సందడే లేదు. కానీ నాల్గో స్థానంలో నిలవడం విశేషం. అయితే తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్లే ఆమెకి అభిమానులు అంతగా ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. 
 

ఇక మన టాలీవుడ్‌ భామ రష్మిక మందన్నా గతేడాది `యానిమల్‌`తో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు `పుష్ప2`తో రాబోతుంది. దీనిపై దేశ వ్యాప్తంగా డిస్కషన్‌ జరుగుతుంది.సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. అయిన రష్మిక ఈ లేటెస్ట్ సర్వేలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె `ది గర్ల్ ఫ్రెండ్‌`, `రెయిన్‌బో`, `కుబేర` చిత్రాల్లో నటిస్తుంది. 

మరోవైపు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా తక్కువకే పడిపోయింది. ఆమె ఎనిమిదో స్థానానికే పరిమితమయ్యింది. ఆమెకి సంబంధించిన వివాదాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఆమెకి విపరీతమైన క్రేజ్‌ ఉంది.సినిమాలతోనూ సందడి చేస్తుంది. అయినా ఆమెకి ఏడో స్థానం రావడం గమనార్హం. 
 

Trisha

ఇక త్రిష ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యింది. ఆమె ఓ వైపు సినిమాలతో, మరోవైపు కొన్ని వివాదాలతోనూ చర్చనీయాంశంగా మారింది. కానీ ఇండియన్‌ టాప్‌ 10 జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకోవడం విశేషం. త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రెండు, మలయాళంలో రెండు మూవీస్‌ చేస్తుంది. 

ఇక బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలవగా, కీర్తి సురేష్‌ తొమ్మిదో స్థానంలో, కృతి సనన్‌ పదో స్థానానికి పరిమితమయ్యింది. కీర్తిసురేష్‌కి తెలుగులో సినిమాలు లేవు. ఆమె తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఓ మూవీ చేస్తుంది. కత్రినా, కృతి సనన్‌ హిందీలో బిజీగా ఉన్నారు. 
 

click me!