నిత్యా మీనన్తో గతంలో ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్టు, ఆయన్ని పెళ్లిచేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.
ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే అది బ్రేకప్ అయ్యిందని, దీంతో ప్రేమ, పెళ్లిపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమవుతోంది.
ఇక నిత్యా మీనన్ `అలా మొదలైంది` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టి ఆకర్షించింది. `ఇష్క్` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.
`జబర్దస్త్`, `గుండెజారి గల్లంతయ్యిందే`, `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `రుద్రమదేవి`, `జనతా గ్యారేజ్`, `అ`, `భీమ్లా నాయక్` వంటి చిత్రాల్లో నటించి విజయాలు అందుకుంది.
`భీమ్లా నాయక్` తర్వాత ఆమె తెలుగుకి దూరమయ్యింది. అటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఓటీటీ మూవీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది నిత్యా మీనన్.