స్టార్ హీరోతో నితిన్ మల్టీస్టారర్ మూవీ.. జోరు భలే ఉందే, హీరోయిన్ ఎవరో తెలుసా ?

First Published Oct 18, 2024, 6:02 PM IST

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. 

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

ఇప్పుడు నితిన్ కి సంబంధించిన  క్రేజీ న్యూస్ అందరిలో ఆసక్తి పెంచేస్తోంది. అర్జున్ సురవరం చిత్రాన్ని తెరకెక్కించిన టీఎన్ సంతోష్ నితిన్ కి ఒక కథ వినిపించారట. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. నితిన్ కి కథ చాలా బాగా నచ్చింది అట. నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కూడా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానని కూడా నితిన్ చెప్పారట. 

Also Read :అది గమనించి పవన్ సినిమా ఆపేసిన చిరంజీవి, లేకుంటే మెగా బ్రదర్స్ నవ్వులపాలు..కానీ డైరెక్టర్ కెరీర్ నాశనం

Latest Videos


ఈ చిత్రంలో ఇంకో బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంది. ఈ చిత్రం మరో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తారని తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ చిత్రం. సంతోష్.. వెంకటేష్ కి కథ చెప్పారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ షురూ చేయడమే. కథ వెంకటేష్ పాత్ర చుట్టూ ఉంటుందని టాక్. 

Keerthy Suresh

ఇది కంప్లీట్ మల్టీస్టారర్ చిత్రమా లేక నితిన్ పాత్ర కొన్ని సీన్లకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాల్సి ఉంది. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రంగ్ దే చిత్రంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ చిత్రంలో నితిన్ లాయర్ గా, వెంకటేష్ పోలీస్ గా కనిపిస్తారట. ఆల్రెడీ టెస్ట్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరి అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

click me!