ప్రియాంక చోప్రా భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చెల్లిలా భావించే తన ప్రాణ స్నేహితురాలు మాయా కిబెల్ 30 ఏళ్లకే కన్నుమూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ప్రియాంక చోప్రా ఆడపడుచు, నిక్ జోనాస్ సోదరిలాంటి స్నేహితురాలు మాయా కిబెల్ మార్చి 7న మరణించారు. ఆమె చాలాకాలంగా 'విల్సన్స్ డిసీజ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
27
మాయా కిబెల్ తల్లి మరణవార్తను తెలిపారు
మాయా కిబెల్ తల్లి కియోకో కిబెల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన కూతురి మరణ వార్తను పంచుకున్నారు. తన కూతురి వ్యాధి, చివరి క్షణాల్లో ఆమె పడిన పోరాటం గురించి ఎమోషనల్ పోస్ట్లో వివరించారు.
37
మాయా కిబెల్ తల్లి ఎమోషనల్ స్టేట్మెంట్
మాయా తల్లి కియోకో కిబెల్ ఇలా రాశారు: 'ఈ వార్తను పంచుకోవడానికి చాలా బాధగా ఉంది. మాయా విల్సన్స్ డిసీజ్ అనే అరుదైన వ్యాధితో బాధపడింది. ఆమె చాలా పోరాడింది, కానీ చివరికి ఆమె శరీరం సహకరించలేదు'.
కియోకో కిబెల్ చెప్పిన దాని ప్రకారం, 'మార్చి 7 ఉదయం మాయా అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయి. అప్పటికే చాలా ఆలస్యమైంది. ఐసీయూలో ఆమె తుది శ్వాస విడిచింది'.
57
చాలా నొప్పిని భరించిన మాయా
కియోకో ఇంకా ఇలా రాశారు: 'గత కొన్ని నెలలుగా ఆమె చాలా నొప్పితో బాధపడింది. చాలాసార్లు ఏడుస్తూనే నిద్రపోయేది. కానీ ఇప్పుడు ఆమె స్వర్గంలో తన తండ్రితో ఉంది. అక్కడ ఆమెకు నొప్పి, కన్నీళ్లు లేవు'.
67
తన సోదరికి నిక్ జోనాస్ భావోద్వేగ నివాళి
మాయా మరణ వార్త తెలిశాక నిక్ జోనాస్ కామెంట్ చేస్తూ, 'నా సోదరివి నువ్వెప్పటికీ... నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను' అని ఎమోషనల్ నోట్ రాశారు. మాయా కిబెల్, నిక్ జోనాస్ చిన్నప్పటి నుంచి పక్కింటి వాళ్లు. ఈ కారణంగానే వారి రెండు కుటుంబాల మధ్య చాలా మంచి అనుబంధం ఏర్పడింది.
77
జ్ఞాపకాల్లో నిలిచిపోయే స్నేహం
మాయా కుటుంబం చాలాసార్లు సోషల్ మీడియాలో ఆమె, నిక్ పాత ఫోటోలను షేర్ చేసింది. ఒక పోస్ట్లో, 'ఏళ్లు గడిచినా, ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నా వారి స్నేహం బలంగానే ఉంది. కుటుంబం, స్నేహితులు అంటే ఇలానే ఉంటారు' అని రాశారు.