రోడ్డు పక్కన పేదవారికి బహుమతులు పంచిన నయనతార దంపతులు, మంచి మనసు చాటుకున్న స్టార్ కపుల్

First Published Jan 5, 2023, 8:38 PM IST

మంచి మనసు చాటుకున్నారు నయనతార - విఘ్నేష్ శివన్ పేదవారికి సాయం చేయడం కోసం తాము స్టార్లమన్న ఆలోచన పక్కన పెట్టేశారు. 

సాధారణంగా సెలబ్రిటీలు రోడ్ల మీద కనిపించరు. సాధారణ ప్రజలతో కలవరు. ఒకవేళ వాళ్లు వచ్చినా.. జనాల మధ్య కలవడం కష్టం. గుంపులుగా మీద పడిపోతుంటారు. కాని అవేవి పట్టించుకోకుండా.. స్టార్లు అన్న భావన లేకుండా.. పేద వారికోసం రోడ్డు మీదకు వచ్చారు నయనతార దంపతులు. ఏసీకార్లు దిగని స్టార్లు... ఎండలోకి వచ్చి మరీ సమాజసేవ చేశారు. 

అప్పుడుప్పుడు తమ అభిమానులతో పాటు.. ఆడియన్స్ కు షాక్ ఇస్తుంటారు  నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు, రోడ్డు మీద యాచకులకోసం  కొన్ని బహుమతులు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నయనతార తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

ఈ వీడియోలో నయనతార తన భర్త విష్నేష్ తో కలిసి కొన్ని గిఫ్ట్ ప్యాక్ లను రోడ్డు మీద యాచకులకు ఇస్తూ కనిపించారు. ఇదంతా కారుల్ ఉన్న తమకు సంబంధించిన వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ పేజ్ లో అప్ లోడ్ చేశారు నయనతార. 

లాస్ట్ ఇయర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు నయనతార , విఘ్నేష్ శివన్.. వెంటనే ఏడాది తిరగకముందే సరోగసి ద్వారా కవలలకు తల్లి తండ్రులు అయ్యారు. ఈ విషయంలో వివాదాలు కూడా ఫేస్ చేసింది ఈ జంట. చివరకు వారికథ సుఖాంతం అయ్యింది. అప్పుడప్పుడు ఇలా సమాజసేవ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. 

నిజానికి వీరిద్దరూ కలసి బహిరంగంగా అంతగా కనిపించరు. కొత్త సంవత్సరం సందర్భంగా పేదలకు ఎంతో కొంత సాయం చేయాలని అనిపించేదేమో.. పేపర్ బ్యాగులో కొన్ని గిఫ్ట్స్ ఉంచి వాటిని రహదారులపై కనిపించిన అభాగ్యులకు అందించారు. చెన్నైలోని పలు రహదారుల్లో తిరుగుతూ వీటిని పంచారు.

నయనతార ప్రస్తుతం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ జంటగా జవాన్ సినిమాలో నటిస్తోంది. అట్లీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈసినిమా రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఇక టాలీవుడ్ లో  రీసెంట్ గా  గాడ్ ఫాదర్ మూవీల్ నటించింది నయనతార. 
 

click me!