వీరసింహారెడ్డి X ప్రతాప్ రెడ్డి.. బాలయ్య దేవుడు.. ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవల్: దునియా విజయ్

First Published Jan 5, 2023, 6:30 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు శుక్రవారం రోజు ఒంగోలు లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. 

అంటే మరికొన్ని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బాలయ్య సింహగర్జన మొదలు కానుంది. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో కన్నడ ప్రముఖ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. దునియా విజయ్ తాజాగా ఇంటర్వ్యూలో వీరసింహా రెడ్డి చిత్ర విశేషాలు పంచుకున్నారు. 

బాలకృష్ణ లాంటి గొప్ప నటుడి చిత్రంలో తనకు అవకాశం రావడమే అదృష్టం అని విజయ్ అన్నారు. ఈ చిత్రంలో తాను పోషించిన విలన్ పాత్ర కథకి పిల్లర్ లాగా ఉంటుంది. దర్శకుడు గోపీచంద్ గారు నాకు కథ వినిపించినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఈ పాత్రకి నన్నే ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాను. గోపీచంద్ నాచిత్రాలు చూశానని చెప్పారు. ఈ రోల్ కి నేను పర్ఫెక్ట్ అని నమ్మారు. నానా అదృష్టం బావుండడం వల్లే ఆయన నన్ను సంప్రదించారు. 

ఈ చిత్రంలో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. చాలా మొరటగా కనిపిస్తాను. ఈ చిత్రంలో ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ముఖ్యంగా ఫైట్స్ ని ప్రేక్షకులు థియేటర్ లో చూసినప్పుడు ఎనెర్జీని ఫీల్ అవుతారు. ఇక బాలకృష్ణ గారిని ఆన్ స్క్రీన్ పై, ఆఫ్ స్క్రీన్ లో చూసిన దేవుడు లాగే అనిపించారు. 

బాలకృష్ణ గారు ఎంతో ఎనెర్జీ తో  అంకితభావంతో పనిచేస్తారు. అది మాకు కూడా కావాలని అనిపిస్తుంది అంటూ దునియా విజయ్ బాలయ్యని ప్రశంసలతో ముంచెత్తారు. మొత్తంగా వీరసింహారెడ్డి చిత్రంలో ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులని కట్టి పడేస్తుంది అని విజయ్ అన్నారు. 

ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, తెలుగులో కూడా మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని విజయ్ పేర్కొన్నారు. పాత్ర బలంగా ఉంటే విలన్ పాత్రలు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. 

click me!