ఆలయంలో నయనతార ఎంతో భక్తి శ్రద్ధలతో కనిపించింది. ఆలయంలో సాష్టాంగ నమస్కారాలు చేసింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల ద్వారా నయనతార తాను, తన భర్త ఎంతో అన్యోన్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పింది. దీంతో విడాకుల రూమర్స్ కి చెక్ పడినట్లు అయింది. పళని మురుగన్ టెంపుల్ ను తమిళ హీరోలు ధనుష్, కార్తీ, శివ కార్తికేయన్ లాంటి వారు తరచుగా సందర్శిస్తుంటారు. ఆ ఆలయం చెన్నై నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉంది.