ప్రభాస్,రజినీకాంత్ కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Jul 06, 2025, 01:34 PM ISTUpdated : Jul 06, 2025, 01:35 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ వల్ల సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది. అంతే కాదు స్టార్ హీరోలు రెమ్యునరేషన కూడా భారీగా పెంచారు. మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాను శాసిస్తున్న హీరోలలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?

PREV
17

దక్షిణాది సినీ పరిశ్రమలో నేడు హీరోలకు లభిస్తున్న పారితోషికం, వారి ఆస్తుల విలువ బాలీవుడ్ స్థాయిలోనే ఉంది. ఒక్క సినిమాకే వందల కోట్లను పారితోషికంగా పొందుతున్న సూపర్ స్టార్లు ప్రస్తుతం తమ ఆస్తుల విలువలో ముందంజలో ఉన్నారు. ఆ కోవలోనే, 2025 నాటికి దక్షిణాదిలో అత్యధిక ఆస్తులున్న నటులు ఎవరెవరో టాప్ 5 జాబితాను ఇప్పుడే చూద్దాం.

27

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో మొదటి స్థానం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే దక్కింది. ఈమధ్య కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే సౌత్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎదిగారు. 

పుష్ప: ది రైజ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఈ హీరో పుష్ప 2: ది రూల్ మూవీతో బాహుబలి రికార్డ్ ను కూడా కొల్లగొట్టాడు. ఈ మెగా విజయం తర్వాత అల్లు అర్జున్ 300 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా బన్నీకి భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

పుష్ప2 సినిమా కు సౌత్ కంటే బాలీవుడ్ నుంచే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు.

37

నాలుగు దశాబ్దాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. మొదటి నుంచి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో రజినీకాంత్ ముందు వరుసలో ఉన్నారు. కానీ ఆతరువాత ఆ ప్లేస్ ను ప్రభాస్, బన్నీలాంటి స్టార్స్ ఆక్రమించారు. సౌత్ లో మొదటి 100 కోట్ల హీరో రజినీకాంత్. ఇక ప్రస్తుతం కూలీ సినిమా కోసం 250 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జైలర్ సినిమా తరువాత ఆయన మార్కెట్ విలువ అమాంతం పెరిగింది.

47

సౌత్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి ఒకరు. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ చివరిగా చేస్తున్న సినిమా జన నాయకన్‌. ఈసినిమాకు ఆయన 250 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు చెబుతున్నారు. మాస్టర్, బీస్ట్, లియో, వంటి వరుస విజయాల తర్వాత, విజయ్ మంచి ఫామ్ లో ఉండగానే సినిమాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు నుంచి అన్ని స్థానాల్లో విజయ్ పోటీచేయబోతున్నాడు.

57

బాహుబలి సినిమాతో మొదటి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈసినిమా నుంచి ఆయన అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వరుసగా ప్రభాస్ సినిమాలు ప్లాప్ అయినా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రెమ్యునరేషన్ విషయంలో తగ్గడంలేదు ప్రభాస్. ప్రస్తుతం వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ సినిమాకు 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

67

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోలు గా వెలుగు వెలుగుతున్నారు రామ్ చరణ్ , ఎన్టీఆర్. ఈ ఇద్దరు స్టార్లు కూడా భారీగా పారితోషికం పెంచేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు పాన్ఇండియా హీరోలుగా మారిపోయారు.ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు సినిమాకు 130 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

77

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో అజిత్ కుమార్ కూడాఉన్నాడు. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్టార్ హీరో ఈసినిమాకు 160 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories