ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సినిమా 3 సెకన్ల వీడియో ఉంది. ఈ సినిమాని ధనుష్ నిర్మించారు. అనుమతి లేకుండా వీడియో వాడినందుకు ధనుష్ కేసు వేశారు. 3 సెకన్ల ఫుటేజ్ కి రూ. 10 కోట్ల దావా వేయడం సంచలనంగా మారింది.
ధనుష్-నయనతార వివాదంపై పలువురు హీరోయిన్స్ స్పందించారు. శృతి హాసన్, అనుపమ, పార్వతి, నజ్రియా నయనతారకి మద్దతు ఇస్తున్నారు. ఈ వివాదంలో ధనుష్ అతి చేస్తున్నారు. నయనతారను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ హీరోయిన్స్ అందరూ గతంలో ధనుష్తో సినిమా చేసినవారే.