జాతీయ అవార్డు సాధించిన తెలుగు రచయితలు
భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇప్పటి వరకు 71 ఎడిషన్లుగా ప్రకటించబడ్డాయి. కొన్ని సంవత్సరాల్లో ఈ విభాగంలో పురస్కారాలు ఇవ్వకపోయినా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు సినిమా ‘బలగం’ నుంచి ఒక ప్రత్యేకమైన పాటకు గుర్తింపు లభించింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటకు గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ఐదవ తెలుగు కవిగా ఆయన నిలిచారు. గతంలో ఈ గౌరవాన్ని పొందిన టాలీవుడ్ గేయ రచయితలు ఎవరంటే?