నందమూరి బాలకృష్ణకి ఆయన తండ్రి నందమూరి తారక రామారావు ఓ రోజు వార్నింగ్ ఇచ్చారట. దెబ్బకు బాలయ్య షూటింగ్ లొకేషన్ కి పరిగెత్తారు. ఆ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది తెలుసా ?
నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో అభిమానులని అలరిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ పౌరాణిక, జానపద చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి చిత్రాలు అద్భుత విజయం సాధించాయి.
25
ఆదిత్య 369 మూవీ
సింగీతం శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య 369 చిత్ర విశేషాలని, షూటింగ్ అనుభవాలని గుర్తు చేసుకున్నారు. ఆదిత్య 369 షూటింగ్ రెగ్యులర్ గా ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. కానీ ఒక రోజు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల షూటింగ్ లేటుగా ప్రారంభం అవుతుంది అని భావించాం. దీనితో హీరో బాలకృష్ణ ముందుగానే షూటింగ్ లొకేషన్ కి ఎందుకు రావడం.. మధ్యాహ్నం 12 గంటలకు వస్తే సరిపోతుంది అని చెప్పాం. అప్పటి లోగా టెక్నికల్ సమస్య పరిష్కారం అవుతుంది.
35
షూటింగ్ ఆలస్యం
మీరు 12 గంటలకు వస్తే షూటింగ్ చేసుకోవచ్చు అని బాలయ్యకు చెప్పా. దీనితో బాలయ్య ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడు ఇంటికి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ గారు కూడా వచ్చారట. ఏంటి ఈ రోజు షూటింగ్ లేదా అని ఎన్టీఆర్ బాలయ్యని ప్రశ్నించారు. ఉంది కానీ సాంకేతిక సమస్య వల్ల నేన్ను మధ్యాహ్నం 12 గంటలకు రమ్మని చెప్పారు అని బాలకృష్ణ వివరించారు.
ఎన్టీఆర్ కి వెంటనే కోపం వచ్చిందట. డైరెక్టర్ గారు ఎప్పుడు రమ్మని చెప్పినా.. షూటింగ్ ఉంది అంటే ఉదయాన్నే వెళ్లి లొకేషన్ లో ఉండడం మన కర్తవ్యం. ఇంట్లో ఉండకూడదు. అలా చేస్తే క్రమశిక్షణ తప్పినట్లే అవుతుంది. నటుడికి క్రమశిక్షణ చాలా అవసరం అని ఎన్టీఆర్ చివాట్లు పెట్టారట.
55
బాలయ్య పరుగో పరుగు
దీనితో బాలయ్య హడావిడిగా పరుగెత్తుకుని షూటింగ్ కి వచ్చేశారు. ఏంటి అప్పుడే వచ్చేశారు అని అడిగితే.. ఇంట్లో కూర్చుని ఉంటే నాన్నగారు క్లాస్ పీకుతున్నారు అని బాలయ్య అన్నారట. ఆ సంఘటన ఎన్టీఆర్ క్రమశిక్షణకి నిదర్శనం అని సింగీతం శ్రీనివాసరావు అన్నారు.