జూ.ఎన్టీఆర్ కి బాలయ్య నో.. పవన్ తో పాటు అతడు కూడా, అన్ స్టాపబుల్ పై ఈ ప్రచారం నిజమేనా ?

First Published Oct 4, 2022, 11:04 AM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 త్వరలో ప్రారంభం కాబోతోంది. కొత్త సీజన్ గురించి అనేక రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. 

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 త్వరలో ప్రారంభం కాబోతోంది. కొత్త సీజన్ గురించి అనేక రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ సీజన్ లో ఫ్యామిలీ మెంబర్స్ ని అతిథులుగా పిలవబోతున్నారట. బాలయ్య సొంత ఫ్యామిలీ నుంచి జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్ స్టాపబుల్ షోకి హాజరు కాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 

అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారం తర్వాత పరిస్థితులు మారాయి. జూ. ఎన్టీఆర్ స్పందనపై సొంత ఫ్యామిలీలోనే వ్యతిరేకత మొదలైంది. దీనితో ఎన్టీఆర్ ని ఈ షోకి ఇన్వైట్ చేయొద్దు అని బాలయ్య నిర్వాహకులకు ఆర్డర్ వేసినట్లు ఒక రూమర్ వైరల్ గా మారింది. 

ఇదే కనుక నిజమైతే నందమూరి ఫ్యామిలిలో మరో రచ్చ మొదలైనట్లే అని ప్రేక్షకులు అంటున్నారు. బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికపై ముచ్చటించుకుంటే నందమూరి ఫ్యాన్స్ చూసి తరిద్దాం అనుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. 

కొత్త సీజన్ కి హాజరు కాబోయే అతిథుల జాబితాలో.. చిరంజీవి, రాంచరణ్.. చంద్రబాబు, నారా లోకేష్.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షోకి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేయాలనేది ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహతులు.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీరిద్దరూ ఏరకంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నిర్మొహమాటంగా అడిగే ప్రశ్నలు హైలైట్ అవుతున్నాయి. సీజన్ 2లో బాలయ్య ఎలా రెచ్చిపోతారో చూడాలి. ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ షో ప్రసారం కానుంది. 

మరికొందరు మాత్రం జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. అసలు అన్ స్టాపబుల్ షో కోసం ఎవరూ ఎన్టీఆర్ ని సంప్రదించలేదని అంటున్నారు. అసలు నందమూరి ఫ్యామిలీ నుంచి అతిథులు ఎవరూ ఈ షోలో పాల్గొనడం లేదని అంటున్నారు. నేడు అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబందించిన ట్రైలర్ విడుదల కానుంది. 

click me!