బాలకృష్ణకి హీరోయిన్ గా ఏఎన్నార్ మనవరాలికి ఛాన్స్.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా మిస్ అయిందో తెలుసా

Published : Sep 01, 2025, 12:51 PM IST

ఏఎన్నార్ మానవరాలితో నందమూరి బాలకృష్ణ నటించాల్సిన సినిమా మిస్ అయింది. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15

టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అలాంటిదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్.. ఏఎన్నార్ మనవరాలిగా సుప్రియ యార్లగడ్డ కలిసి నటించిన చిత్రం అది. ఆ తర్వాతి కాలంలో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు. సుప్రియ మాత్రం తొలి చిత్రంతోనే నటనకి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

25

తొలి చిత్రంతోనే ఎందుకు యాక్టింగ్ ఆపేయాల్సి వచ్చింది, ఆ తర్వాత అవకాశాలు రాలేదా అనే ప్రశ్నపై సుప్రియ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫారెన్ లో చదువుకుని వచ్చాక సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఒకసారి అల్లు అరవింద్ గారు కనిపించారు. ఏవమ్మాయ్.. సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. నేను ఒకే అని చెప్పాను. ఆ విధంగా అల్లు అరవింద్ గారి నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో నా ఫస్ట్ మూవీ ప్రారంభమైంది.

35

నేను అనుకున్నంత ఈజీ కాదు సినిమాల్లో నటించడం అంటే. అప్పట్లో హీరోయిన్ అంటే ఏడుపు సీన్లలో కూడా అందంగానే కనిపించాలని అనేవారు. డైరెక్టర్ చాలా సార్లు నాపై అరిచారు. కష్టం మీద అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పూర్తి చేశాను అని సుప్రియ పేర్కొంది.

45

ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ఏకంగా నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది అని సుప్రియ పేర్కొంది. బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించమని నన్ను అడిగారు. కానీ తొలి చిత్రం తర్వాత ఇక నటించాలని నేను అనుకోలేదు. అందుకే ఆ ఛాన్స్ వదులుకున్నట్లు సుప్రియ పేర్కొంది.

55

ఆ విధంగా ఎన్టీఆర్ కొడుకు, ఏఎన్నార్ మనవరాలు కలిసి నటించాల్సిన కాంబినేషన్ మిస్ అయింది. సుప్రియ దాదాపు 22 ఏళ్ళ తర్వాత గూఢచారి చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో కీలక పాత్రలో నటించింది.

Read more Photos on
click me!

Recommended Stories