లక్షలాది మంది హాజరైన కుంభమేళాలో ఒక అమ్మాయి స్టార్ గా మారింది. ఆమె పేరు మోని భోంస్లే (మోనాలిసా). కుంభమేళాలో రూ.100కి దండలు అమ్ముతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్లని తలదన్నేలా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆమెను చూడటానికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో, మోని ఆ దండ అమ్మకం మానేసి ఇంటికి తిరిగి రావాల్సి రావడం పెద్ద వార్త అయింది.