నాగార్జున వరస్ట్ హోస్ట్.. సన్నీని దోషిగా తేల్చడంపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌.. సన్నీ, షన్ను ఫ్యాన్స్ ఢీ

First Published Nov 14, 2021, 8:01 AM IST

బిగ్‌బాస్‌ తెలుగు 5 హోస్ట్ నాగార్జునపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఎపిసోడ్‌లో ఆయన ఇచ్చిన తీర్పులు, సన్నీని దోషిగా నిలబెట్టే విషయంలో నాగ్‌ ఫైర్‌ అవడం విమర్శలకు తావిస్తుంది.మరోవైపు షణ్ముఖ్‌, సన్నీ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu5)లో.. 70వ ఎపిసోడ్‌(శనివారం) మరోసారి హౌజ్‌ని హీటుపెంచింది. దోషి ఎవరో తేల్చాలని నిర్ణయించే `ఎఫ్‌ఐఆర్‌` టాస్క్ లో ప్రధానంగా మూడు ఎఫ్‌ఐఆర్‌లు సన్నీ(Sunny)పై నమోదయ్యాయి. దీంతో అతన్ని నేరస్తుడిగా నిర్ణయిస్తూ సన్నీ మెడలో గిల్టీ బోర్డ్ వేశారు. అయితే సన్నీని దోషిగా తేల్చడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన విషయం ప్రధానంగా రవి, షణ్ముఖ్‌, సిరి.. సన్నీని నేరస్తుడిగా ముద్ర వేశారు. టాస్క్ లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ ఆయన్ని దోషిగా నిర్ణయించారు. 

అయితే అందులో తన తప్పేం లేదని, వాళ్లు రెచ్చగొడితేనే తాను అలా రియాక్ట్ అయ్యాయని, తన జోలికి రాకపోతే తాను ఎవరి జోలికి వెళ్లను అని స్పష్టం చేశాడు Sunny.  సిరితో వాగ్వాదం సమయంలో తంతా, అప్పడం అయిపోతావు, ఆడవాళ్లని అడ్డుపెట్టుకుని ఆడుతున్నారనే వ్యాఖ్యలను రవి, సిరి, షణ్ముఖ్‌, అనీ మాస్టర్‌ తప్పు పట్టారు. ఈ విషయంలోనే శనివారం ఎపిసోడ్‌లో మరోసారి సభ్యులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. 

ఆ పదాలు సన్నీ నుంచి వచ్చిన నేపథ్యంలో హోస్ట్ నాగార్జున(Nagarjuna) కూడా సన్నీదే తప్పు అని నిర్ణయించాడు. అయితే అక్కడ ఏం జరిగింది, సన్నీ ఏం అన్నాడు అనేది క్లారిటీ రావడం కోసం వీడియో కూడా చూపించాడు నాగ్‌. దాని తర్వాతనే Nagarjuna కూడా `తంతా` అనే పదాన్ని .. ఫస్ట్ సిరినే అన్నావు అని, ఆ తర్వాత మాట మార్చావు అని చెప్పారు. మరో వైపు `అప్పడం` అని, `అప్పడాన్ని అమ్ముతా` అనే పదాలు కూడా తప్పు అని, అమ్మాయిని పట్టుకుని అలా అనొచ్చా అంటూ రవి, షణ్ముఖ్‌తోపాటు నాగార్జున కూడా ఫైర్‌ అయ్యాడు. 
 

ఇక్కడే నెటిజన్లకి మంటపుట్టిస్తుంది. వీడియోల్లోనూ స్పష్టంగా సన్నీ అన్న మాటల ఉద్దేశం కన్పిస్తుందని, ఆయన్ని రెచ్చగొడితేనే ఆయన రియాక్ట్ అయ్యాడని, తంతా అన్నది బ్రిక్స్ నే అని, అప్పడం అయిపోతావనే అన్నది తనని పట్టుకున్నందుకే, అప్పడం అమ్ముతా అన్నది కూడా సిరి అమ్ముకో పో అంటేనే అని, అందులో సన్నీ తప్పేం లేదని, వాళ్లు రెచ్చగొడితేనే రియాక్ట్ అయ్యాడని అంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో నాగార్జున బైయాస్‌గా ఉండాల్సింది పోయి, సన్నీని దోషిగా తేల్చడం కరెక్ట్ కాదని, షణ్ముఖ్‌, సిరిలకు సపోర్ట్ చేస్తూ సన్నీని తప్పుపట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు నాగార్జునని ఇప్పుడు ట్రోల్‌ చేస్తున్నారు. 
 

ప్రధానంగా బిగ్‌బాస్‌5 షోకి నాగార్జున అన్‌ఫిట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరైన తీర్పు ఇవ్వడంలో నాగార్జున విఫలమయ్యాడని,  వరస్ట్ హోస్ట్ నాగార్జున అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏ హోస్ట్ అయిన ఇలాంటి సమయాల్లో బైయాస్‌గా ఉంటారు, కానీ నాగ్‌ మాత్రం షణ్ముఖ్‌, సిరిలనే సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఆయన్ని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు షణ్ముఖ్‌తోపాటు నాగార్జున ట్రోల్‌ అవుతున్నారు. 

అయితే బిగ్‌బాస్‌ 5 హౌజ్‌లో జెన్యూన్‌గా ఆట ఆడేది సన్నీ మాత్రమే అని, స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు కాబట్టి అతన్ని అందరు టార్గెట్‌ చేస్తున్నారని, అతన్ని కంట్రోల్‌ చేస్తే ఆటని తమవైపు తిప్పుకోవాలని ఇతర సభ్యులు భావిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు వేయడం గమనార్హం. అయితే సన్నీని సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టే వారిలో ఆయన ఫ్యాన్సే ప్రధానంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ జనరల్‌ ఆడియెన్స్ కూడా ఇందులో భాగమవుతూ సన్నీని సపోర్ట్ చేస్తుండటం, నాగార్జున, సిరి, షణ్ముఖ్‌లపై విమర్శలు గుప్పిస్తుండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి ఈ ఎపిసోడ్‌లో నాగార్జున బైయాస్‌గా లేడనేది మాత్రం స్పష్టంగా నెటిజన్ల నుంచి వినిపిస్తున్న వాదన. 
 

మరోవైపు యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌(Shanmukh), సన్నీ ఫ్యాన్స్ మధ్య కూడా యుద్ధం జరుగుతుంది. ఇంటర్నెట్‌లో ఇద్దరు అభిమానులు గట్టిగానే ఏసుకుంటున్నారు. ShanmukhBigg Boss Telugu 5: సన్నీని దోషిగా తేల్చిన సభ్యులు.. కానీ సన్నీ ధైర్యాన్ని ప్రశంసించిన నాగ్‌.. ఇదేం ట్విస్ట్ ఫ్యాన్స్  సన్నీని, సన్నీ ఫ్యాన్స్ షణ్ముఖ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. లయన్‌ ఎప్పుడైనా లయనే అని సన్నీ ఫ్యాన్స్, మిస్టర్ కూల్‌ షణ్ము అని షణ్ముఖ్‌ అభిమానులు కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా బిగ్‌బాస్‌తెలుగు 5 షో రేటింగ్‌లకు అతీతంగా రక్తికట్టిస్తూ,ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

also read: 
 

click me!